News February 9, 2025
నెల్లూరు: రెండేళ్ల వ్యవధిలో ఇద్దరు కుమారుల దారుణ హత్య
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739069971481_1106-normal-WIFI.webp)
నెల్లూరులో శనివారం కోడూరు కళ్యాణ్ అలియాస్ చిన్నా దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. కాగా రెండేళ్ల క్రితం చిన్నా సోదరుడు సాయిపై కొందరు కత్తులు, రాళ్లతో దాడి చేసి చంపేశారు. రెండేళ్ల వ్యవధిలో ఇద్దరు కుమారులు హత్యకు గురి కావడంతో వారి తల్లి గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. కాగా ఇప్పటికే చిన్నా డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం GGHకు తరలించారు.
Similar News
News February 10, 2025
నెల్లూరు పోలీస్ గ్రీవెన్స్కు 98 అర్జీలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739185202492_52112909-normal-WIFI.webp)
పోలీసు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీలను విచారించి చట్టపరంగా న్యాయం చేస్తామని SP జి. కృష్ణ కాంత్ తెలిపారు. సోమవారం జిల్లా నలుమూలల నుంచి 98 ఫిర్యాదులు అందాయని ఆయన వెల్లడించారు. వాటి పరిష్కారానికి ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News February 10, 2025
ఒత్తిడి అధిగమిస్తేనే ఉత్తమ ఫలితాలు: నెల్లూరు కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739183843345_51908050-normal-WIFI.webp)
నెల్లూరు ఈఎస్ఆర్ఎం ఉన్నత పాఠశాలలో సోమవారం ప్రధాని మోదీ పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ విద్యార్థులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ.. మీరు రాసే పరీక్షల్లో ఒత్తిడి అధిగమిస్తేనే మంచి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ బాలాజీ రావు, విద్యార్థులు పాల్గొన్నారు.
News February 10, 2025
కావలి: కస్తూర్బా ఘటనపై హోంమంత్రి అనిత ఆరా!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739173924923_52112909-normal-WIFI.webp)
కావలి రూరల్ మండలం ముసునూరు శివారు ప్రాంతంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అర్ధరాత్రి గుర్తు తెలియని అగంతకుడు ప్రవేశించడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర హోం మంత్రి అనిత కావలి డీఎస్పీ శ్రీధర్ను ఫోన్లో వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. విద్యాలయం పరిసర ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. బాలికల తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళన చెందొద్దని మంత్రి కోరారు.