News February 9, 2025

పరగడుపున వీటిని తింటున్నారా?

image

పరగడుపున కొన్ని ఆహార పదార్థాలు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే ఏమీ తినకుండా నిమ్మ, నారింజ, దానిమ్మ పండ్లు తీసుకుంటే గ్యాస్ సమస్యలు వస్తాయి. ఉప్పు, కారం, మసాలా ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోకూడదు. డీప్ ఫ్రై చేసిన పదార్థాలు తింటే పొట్ట ఉబ్బరం, అజీర్తి కలుగుతాయి. తీపి పదార్థాలు, టీ, కాఫీ తీసుకుంటే ఎసిడిటీ వస్తుంది. ఐస్‌క్రీమ్, కూల్‌డ్రింక్స్ తాగకూడదు. నిల్వ పచ్చళ్లు, చీజ్ తినకూడదు.

Similar News

News February 10, 2025

BREAKING: అకౌంట్లో డబ్బుల జమ

image

తెలంగాణలోని రైతులకు శుభవార్త. 2 ఎకరాల వరకు రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఒక్కొక్కరికి రూ.6వేల చొప్పున మొత్తం 8.65 లక్షల మంది ఖాతాల్లో రూ.707.54 కోట్లు జమ చేసింది. కాగా ఇప్పటికే ఎకరం పొలం ఉన్న 17 లక్షల మంది రైతులకు రూ.557 కోట్లు, 557 పైలట్ గ్రామాలకు చెందిన వారికి రూ.568 కోట్లు జమ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు మొత్తం 30.11 లక్షల మంది రైతులకు రూ.1834.09కోట్లు జమ అయ్యాయి.

News February 10, 2025

రంగరాజన్‌పై దాడి.. స్పందించిన DCP

image

TG:చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై ఇటీవల జరిగిన దాడి <<15408903>>ఘటనపై <<>>రాజేంద్రనగర్ DCP శ్రీనివాస్ స్పందించారు. ‘ఇవాళ ఇద్దరు మహిళలు సహా ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపాం. నిందితులు ఖమ్మం, నిజామాబాద్‌కు చెందిన వారు. 2022లో వీరరాఘవరెడ్డి ‘రామరాజ్యం’ అనే సంస్థను ప్రారంభించారు. సంస్థలో సభ్యులను చేర్పించాలని, ఆర్థిక సాయం చేయాలని రంగరాజన్‌ను కోరారు. ఒప్పుకోకపోవడంతో దాడి చేశారు’ అని చెప్పారు.

News February 10, 2025

పంచాయతీ ఎన్నికలపై BIG UPDATE

image

తెలంగాణ ప్రభుత్వానికి డెడికేటెడ్ బీసీ కమిషన్ 700 పేజీలతో నివేదిక సమర్పించింది. ఈ కమిషన్ నివేదిక ఆధారంగానే రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. గ్రామం ఒక యూనిట్‌గా వార్డు సభ్యుల రిజర్వేషన్లు, మండలం ఒక యూనిట్‌గా ఎంపీటీసీల రిజర్వేషన్లు, జిల్లా ఒక యూనిట్‌గా ZPTCల రిజర్వేషన్లు, రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని ZP ఛైర్మన్ రిజర్వేషన్లను పంచాయతీ రాజ్ శాఖ ఖరారు చేయనుంది.

error: Content is protected !!