News February 9, 2025
జగిత్యాల: పీఎంఈజీసీ రుణాల పేరుతో మోసం.. అరెస్టు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739064656193_60439612-normal-WIFI.webp)
ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ గ్యారంటీ ప్రోగ్రాం కింద సబ్సిడీ రుణాలు ఇప్పిస్తానని జగిత్యాల జిల్లాలో వేణు వర్మ అనే యువకుడు పలువురి నుంచి లక్షల్లో వసూలు చేశాడు. మంచిర్యాల జిల్లా హజీపూర్కు చెందిన వేణు వర్మను బాధితులు శనివారం JGTL పట్టణంలోని తీన్ ఖని ప్రాంతంలో పట్టుకుని జగిత్యాల టౌన్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 10, 2025
KMR: ‘క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి’
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739195036238_50093551-normal-WIFI.webp)
ప్రతి పోలీసు విధి నిర్వహణలో క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని పోలీసు సీనియర్ అధికారులు సూచించారు. KMR జిల్లా ఎస్పీ సింధుశర్మ ఆదేశాల మేరకు ఇటీవల నూతనంగా నియామకమైన కానిస్టేబుల్లకు జిల్లా పోలీసు కార్యాలయంలో రెండు రోజుల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్లో విధులు ఎలా నిర్వర్తించాలి, ప్రజలతో ఎలా మెలగాలి తదితర విషయాలను కామారెడ్డి సీఐ చంద్రశేఖర్ వివరించారు.
News February 10, 2025
కుంభమేళాలో 12 మంది జననం.. పేర్లు ఇవే
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739193433195_695-normal-WIFI.webp)
మహాకుంభ మేళా సందర్భంగా ప్రయాగ్రాజ్లో ఏర్పాటుచేసిన సెంట్రల్ హాస్పిటల్లో 12 మంది మహిళలు బిడ్డలకు జన్మనిచ్చినట్లు అధికారులు తెలిపారు. అన్నీ సాధారణ కాన్పులేనని చెప్పారు. వీరిలో యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఝార్ఖండ్ రాష్ట్రాలవారు ఉన్నారన్నారు. ఆడపిల్లలకు బసంతి, గంగా, జమున, బసంత్ పంచమి, సరస్వతి, మగ బిడ్డలకు కుంభ్, భోలేనాథ్, బజ్రంగీ, నంది తదితర పేర్లు పెట్టినట్లు వివరించారు.
News February 10, 2025
ధన్వాడ: బీజేపీకి సీనియర్ నాయకుడు రాజీనామా
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739182982399_50253107-normal-WIFI.webp)
ధన్వాడ మండలం బీజేపీలో అంతర్గత విభేదాలతో సీనియర్ నాయకుడు ఎర్రగుంట్ల విజయకుమార్ సోమవారం బీజేపీకి రాజీనామ చేశారు. పార్టీలో సీనియర్ అయినప్పటికీ తగిన గుర్తింపు ఇవ్వకపోవడంతో రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. మండల పార్టీ అధ్యక్ష పదవికి పోటీపడిన విజయ్ కుమార్ను కాదని శివరాజ్ సాగర్కు ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఆయనతో పాటు శ్రీనివాసులు మరికొందరు పార్టీని వీడారు.