News February 9, 2025
నులిపురుగులపై అవగాహన కల్పించాలి: DEO

ఈనెల 10వ తేదీన జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విస్తృతంగా ప్రచారం చేయాలని గుంటూరు డీఈవో సీవీ. రేణుక ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. నులి పురుగులపై అసెంబ్లీలో అవగాహన కల్పించాలన్నారు. మధ్యాహ్న భోజనం చేసిన 30 నిమిషాల తర్వాత ఆల్బెండజోల్ ట్యాబ్లెట్లు విద్యార్థులతో వేయించాలన్నారు. హాజరు కాని విద్యార్థులకు 17వ తేదీన ఇవ్వాలన్నారు.
Similar News
News March 6, 2026
GNT: రైల్వే గేట్ మూసినా ముందుకెళ్తే.. ప్రమాదం తప్పదు..!

ప్రజలు రైల్వే క్రాసింగ్లు దాటేటప్పుడు అధికారుల సూచనలు పాటించి నిబంధనలకు లోబడి ప్రవర్తిస్తే ప్రమాదాలను నివారించవచ్చని గుంటూరు డివిజన్ DSO కీర్తి తెలిపారు. గేట్ మూసిన తర్వాత కూడా కొందరు నిర్లక్ష్యంగా దాటేందుకు ప్రయత్నించడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. విజయవాడ–గుంటూరు–తెనాలి మార్గంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో జిల్లాల్లో ప్రతి ఏడాది 30–60 రైల్వే సంబంధిత మరణాలు నమోదవుతున్నాయి.
News March 6, 2026
GNT: రైల్వే గేట్ మూసినా ముందుకెళ్తే.. ప్రమాదం తప్పదు..!

ప్రజలు రైల్వే క్రాసింగ్లు దాటేటప్పుడు అధికారుల సూచనలు పాటించి నిబంధనలకు లోబడి ప్రవర్తిస్తే ప్రమాదాలను నివారించవచ్చని గుంటూరు డివిజన్ DSO కీర్తి తెలిపారు. గేట్ మూసిన తర్వాత కూడా కొందరు నిర్లక్ష్యంగా దాటేందుకు ప్రయత్నించడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. విజయవాడ–గుంటూరు–తెనాలి మార్గంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో జిల్లాల్లో ప్రతి ఏడాది 30–60 రైల్వే సంబంధిత మరణాలు నమోదవుతున్నాయి.
News March 5, 2026
ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సవిత

ఉద్యోగులతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, వారి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని BC సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. ఎలక్ట్రిసిటీ బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ క్యాలెండర్, డైరీని గురువారం సచివాలయంలో ఆమె ఆవిష్కరించారు. రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం రాగానే ప్రతి నెల ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు అందేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.


