News February 9, 2025
మలికిపురం: అవార్డు అందుకున్న మన పల్లెటూరు చిత్రం

మలికిపురం మండలం మోరికి చెందిన గంట మధు చిత్రానికి అవార్డు లభించింది. నేటి వరకు హైదరాబాద్ JNTUలో క్రియేటివిటీ ఆర్ట్స్ అకాడమీ మాస్టర్ స్ట్రోక్-4లో 50 మంది చిత్రకారులతో ఆర్ట్షో నిర్వహించారు. మన పల్లెటూరు గ్రామాల్లో ఉండే అందమైన ప్రకృతిని మధు అద్భుతంగా చిత్రించారు. ఈ దృశ్యం హైదరాబాదు JNTU యూనివర్సిటీలో విశేష జనాదరణ పొందింది. JNTU ప్రొఫెసర్ ఉదయ్ కుమార్ మధును అభినందించి ఘనంగా సత్కరించారు.
Similar News
News September 18, 2025
సీఎంతో డీఎస్సీ అభ్యర్థుల సమావేశం వాయిదా: డీఈవో

వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో శుక్రవారం అమరావతిలో జరగాల్సిన డీఎస్సీ ఉపాధ్యాయుల సమావేశం వాయిదా పడినట్లు డీఈఓ షేక్ సలీం బాషా తెలిపారు. జిల్లా కలెక్టర్ నుంచి ఈ సమాచారం అందినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎంఈఓలు డీఎస్సీ అభ్యర్థులకు తెలియజేయాలని సూచించారు. తదుపరి సమావేశం తేదీని ఇంకా నిర్ణయించలేదని, డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
News September 18, 2025
వైట్ హెడ్స్ ఇలా తొలగిద్దాం..

కొందరికి చర్మంపై చిన్నగా తెల్లని మచ్చలు ఉంటాయి. అవే వైట్ హెడ్స్. ఈ సమస్యను తగ్గించుకోవాలంటే ఈ టిప్స్ పాటించండి. * కాస్త ఓట్స్ పొడిలో నీళ్లు కలిపి మెత్తని ముద్దలా చేసి సమస్య ఉన్న చోట రాయాలి.15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. * చెంచా వంటసోడాలో నీళ్లు కలిపి వైట్హెడ్స్ ఉన్న చోట రాయాలి. ఆ వంట సోడా పూత ఆరిపోయాక కడిగెయ్యాలి. ఇలా తరచూ చేస్తోంటే వైట్ హెడ్స్తోపాటు అధిక జిడ్డు సమస్య కూడా తగ్గుతుంది.
News September 18, 2025
VJA: దుర్గా మల్లేశ్వరస్వామి హుండీ ఆదాయ వివరాలు

ఇంద్రకీలాద్రిపై గత 14 రోజుల కాలానికి సంబంధించిన హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. రూ.2,17,98,528 నగదు, 235 గ్రా. బంగారం, 1.39 కి.గ్రా. వెండి హుండీ కానుకలుగా వచ్చాయని EO శీనా నాయక్ తెలిపారు. 321 US డాలర్లు, 10 సింగపూర్ డాలర్లు, 25 UAE దిర్హమ్స్, 25 సౌదీ రియల్స్, 200 ఒమన్ బైసా కరెన్సీతో పాటు 7 ఇతర దేశాల విదేశీ కరెన్సీ ఇంద్రకీలాద్రిపై ఉన్న 48 హుండీలలో కానుకలుగా వచ్చాయన్నారు.