News February 9, 2025
నల్గొండ: బస్సులో రూ.23 లక్షల చోరీ

నల్గొండ జిల్లాలో భారీ చోరీ జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో ప్రయాణికుడి బ్యాగు నుంచి రూ.23 లక్షలను ఎత్తుకెళ్లారు. నార్కెట్పల్లి వద్ద ఓ హోటల్లో టిఫిన్ చేసేందుకు ప్రయాణికులు దిగారు. అనంతరం బ్యాగు చూసుకుంటే మాయమైనట్లు బాధితుడు తెలిపాడు. దీంతో నార్కెట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Similar News
News January 19, 2026
నల్గొండ: ఖతార్లో భారీగా ఉద్యోగాలు

విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే నిరుద్యోగులకు TOMCOM మంచి అవకాశం కల్పిస్తోంది. ఖతార్లో అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్, సివిల్ ఇంజినీర్, HSE ఆఫీసర్ వంటి పలు విభాగాల్లో ఖాళీలు ఉన్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఎన్.పద్మ తెలిపారు. 25-35 ఏళ్ల వయస్సు ఉండి, సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా ఇంజినీరింగ్ చేసిన వారు అర్హులని చెప్పారు. ఎంపికైన వారికి ఆకర్షణీయమైన జీతంతో పాటు ఇతర వసతులు ఉంటాయని చెప్పారు.
News January 19, 2026
NLG: బంకుల్లో వసూళ్లే.. వసతుల్లేవ్!

నల్గొండ జిల్లాలో కొన్ని పెట్రోల్ బంకుల్లో సౌకర్యాలు కరువయ్యాయి. డబ్బులు వసూలు చేస్తున్న యజమానులు కనీస సౌకర్యాలను విస్మరిస్తున్నారు. ఉచిత గాలి, తాగునీరు, మరుగుదొడ్లు ఉండాలన్న రూల్స్ తుంగలో తొక్కుతున్నారు. టాయిలెట్లు కంపు కొడుతున్నాయి.. లేదంటే తాళాలు వేస్తున్నారు. ఫస్ట్ ఎయిడ్ కిట్లు కాలం చెల్లినవే. నాణ్యతను ప్రశ్నిస్తే దబాయిస్తున్నారు. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలున్నాయి.
News January 19, 2026
నేటి నుంచి సర్పంచులకు శిక్షణ.. పంచాయతీ పాలనపై అవగాహన

నల్గొండ జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు నేటి నుంచి ఐదు రోజుల పాటు శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ శిక్షణలో పంచాయతీరాజ్ చట్టం, గ్రామ పాలన, నిధుల వినియోగంపై అవగాహన కల్పిస్తారు. శిక్షణ ఇచ్చేందుకు ఇప్పటికే రిసోర్స్ పర్సన్లను ఎంపిక చేశారు. జిల్లాలోని 869 పంచాయతీలకు గాను 866 గ్రామాల్లో పాలకవర్గాలు కొలువుదీరిన నేపథ్యంలో, వారికి తమ విధులు, బాధ్యతలపై పూర్తిస్థాయిలో పాఠాలు నేర్పనున్నారు.


