News February 9, 2025

సెమీస్‌కు అనకాపల్లి జిల్లా మహిళల హాకీ జట్టు

image

అనకాపల్లి జిల్లా సీనియర్ మహిళల హాకీ జట్టు సత్తా చాటి సెమీస్‌కు చేరింది. అంతర్ జిల్లాల మహిళల హాకీ పోటీలు నెల్లూరు జరుగుతున్నాయి. నెల్లూరు జట్టుపై అనకాపల్లి జట్టు క్వార్టర్ ఫైనల్స్‌లో తరబడి 0-5 గోల్స్ తేడాతో గెలుపుపొందిందని అనకాపల్లి జిల్లా హాకీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొఠారు నరేశ్ తెలిపారు. ఈనెల 8 నుంచి పోటీలు జరుగుతున్నాయన్నారు.

Similar News

News July 5, 2025

విశాఖ గోల్డ్ వ్యాపారులకు హెచ్చరిక

image

విశాఖలో ఆభరణాల వ్యాపారులకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (B.I.S.) హాల్ మార్కింగ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించింది. నిబంధనలు గురించి ఆభరణాల వ్యాపారులకు వివరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చిక్కుడు తప్పవని B.I.S. దక్షిణ ప్రాంత డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రవీణ్ ఖన్నా హెచ్చరించారు. B.I.S. కేర్ మొబైల్ యాప్ గురించి వివరించారు.‌ విశాఖ నుంచి 100 మంది గోల్డ్ వ్యాపారులు హాజరయ్యారు.

News July 5, 2025

సూర్యాపేట: చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి

image

చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతిచెందిన ఘటన సూర్యాపేట జిల్లా నడిగూడెంలో ఈరోజు చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. బస్టాండ్ వద్ద కాసాని నాగేశ్వరరావు వేపచెట్టు కొమ్మలు నరుకుతుండగా ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడ్డాడు. తీవ్ర గాయాలవగా మెరుగైన చికిత్స నిమిత్తం అతడిని ఖమ్మం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు.

News July 5, 2025

MBNR: సైబర్ నెరగాళ్లతో జాగ్రత్త: ఎస్పీ

image

పేదలను లక్ష్యంగా చేసుకుంటూ కొత్త తరహా సైబర్ మోసాలు పెరుగుతున్నాయని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డి.జానకి సూచించారు. నకిలీ యాప్‌లు, పార్ట్ టైం జాబ్స్, వర్క్ ఫ్రం హోం తదితర ఫేక్ లింక్, యువతులపై ఆన్లైన్‌లో వేధింపులు, ఫొటోలు మార్ఫింగ్ చేస్తూ కొత్త తరహా మోసాలు పెరుగుతున్నాయని చెప్పారు. అలాంటి వాటిపై జాగ్రత్తగా ఉండాలని, 1930 లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలన్నారు.