News February 9, 2025
బిక్కనూర్: గంజాయి విక్రయిస్తున్న ఎనిమిది మంది అరెస్ట్

గంజాయి విక్రయిస్తున్న ఎనిమిది మందిని అరెస్టు చేసే రిమాండ్కు తరలించినట్లు బిక్కనూర్ ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. మండల కేంద్రంతో పాటు జంగంపల్లి రామేశ్వర్ పల్లి గ్రామానికి చెందిన 8 మంది యువకులు మహారాష్ట్ర నుంచి గంజాయి తీసుకువచ్చి విక్రయించడంతో పాటు దానిని సేవిస్తూ పలువురు యువకులను బానిస చేస్తున్నారని చెప్పారు. ఈ విషయంలో వారిని అదుపులోకి తీసుకొని విచారించి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు వివరించారు.
Similar News
News April 3, 2026
రాష్ట్రంలో 87 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్ల పునర్విభజన

AP: రాష్ట్రంలో 87 మున్సిపాలిటీలు, 13 మున్సిపల్ కార్పొరేషన్ల పునర్విభజనకు ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈ డీలిమిటేషన్ జరిగింది. ఈ మార్పులతో వార్డుల సంఖ్య విశాఖలో 98 నుంచి 120కి, విజయవాడలో 64 నుంచి 86కు, గుంటూరులో 57 నుంచి 76కు, నెల్లూరులో 54 నుంచి 72కి, కర్నూల్లో 52 నుంచి 68కి, తిరుపతిలో 50 నుంచి 66కు, అనంతపురంలో 50 నుంచి 62కు పెరిగాయి.
News April 3, 2026
KMCలో అద్భుతం.. ఏళ్లనాటి నొప్పికి సొల్యుషన్

KMC సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో పెయిన్ మేనేజ్మెంట్ సేవలు విస్తరించాయి. 10 ఏళ్లుగా ట్రైజెమినల్ న్యూరాల్జియా(తీవ్రమైన ముఖం నొప్పి)తో బాధపడుతున్న రోగికి డా.చిలక మురళి బృందం మొదటిసారిగా ట్రైజెమినల్ గ్యాంగ్లియన్ బ్లాక్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించింది. ఔషధాలు పనిచేయని స్థితిలో ఈ ఆధునిక చికిత్సతో రోగికి ఉపశమనం లభించింది. ఈ సందర్భంగా వైద్య బృందాన్ని KMC ప్రిన్సిపల్ డా.సంధ్య ప్రత్యేకంగా అభినందించారు.
News April 3, 2026
TU: రేపటి నుంచి ఇంటిగ్రేటెడ్ పీజీ పరీక్షలు

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని ఇంటిగ్రేటెడ్ పీజీ (అప్లైడ్ ఎకనామిక్స్, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ) 8, 10 సెమిస్టర్ల రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలు రేపటి నుంచి ఈ నెల 16 వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. 8వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 4, 7, 9, 13, 16 తేదీల్లో, 10వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 6, 8, 10, 15 తేదీల్లో జరగనున్నాయని పేర్కొన్నారు.


