News February 9, 2025

అంబాజీపేటలో తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

image

అంబాజీపేట మండలం ఇసుకపూడికి చెందిన పమ్మి వెంకటేశ్శరరావు గత రెండు సంవత్సరాలుగా అనారోగ్యానికి గురైయ్యారు. కూతురు పద్మ అన్నీ తానై తండ్రికి ఎన్నో సపర్యలు చేసింది. ఆదివారం పరిస్థితి విషమించడంతో వెంకటేశ్వరరావు తుది శ్వాస విడిచారు. కొడుకు స్థానంలో తలకొరివి పెట్టింది. గతంలో తన తల్లికి ఆరోగ్యం సరిగా లేని సమయంలో కూడా తల్లికి అన్ని కార్యక్రమాలు కూతురే నిర్వహించిందని బంధువులు తెలిపారు. 

Similar News

News November 11, 2025

కామారెడ్డి జిల్లాలో భూముల రీసర్వేకు కలెక్టర్ గ్రీన్ సిగ్నల్

image

కామారెడ్డి జిల్లాలోని 16 మండలాల పరిధిలో భూముల రీసర్వే పనులను చేపట్టడానికి జిల్లా కలెక్టర్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. భూములకు సంబంధించిన స్వంతదారులు, రిజిస్టర్ దారులు సరిహద్దులు గుర్తించడానికి అవసరమైన సమాచారంతో తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ సూచించారు. జిల్లా ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే శ్రీనివాస్ పర్యవేక్షణలో ఈ రీసర్వే జరుగుతుందని కలెక్టర్ ప్రకటించారు.

News November 11, 2025

రన్నర్‌గా తూ.గో జిల్లా అధికారులు

image

అనంతపురంలో ఈనెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు 7వ రాష్ట్రస్థాయి రెవెన్యూ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్-2025 జరిగింది. ఇందులో తూ.గో జిల్లా రెవెన్యూ అధికారులు, సిబ్బంది ప్రతిభ చూపారు. బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో కడియం తహసీల్దార్ ఎం.సునీల్ కుమార్, రాజానగరం సీఎస్ డీటీ జి.బాపిరాజు జట్టు రన్నర్‌‌గా నిలిచారు. వాలీబాల్ విభాగంలో తూ.గో జట్టు రన్నర్‌‌గా నిలిచింది.

News November 11, 2025

ముంబై ఆ ఇద్దరిని వదిలేయాలి: హెడెన్

image

IPL రిటెన్షన్స్ ప్రకటనకు ముందు ముంబై ఇండియన్స్‌కు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ హెడెన్ కీలక సూచనలు చేశారు. గత వేలంలో అధిక ధరకు కొనుగోలు చేసిన బౌల్ట్(₹12.5Cr), దీపక్ చాహర్(₹9.25Cr)ను వదిలేయాలని అభిప్రాయపడ్డారు. వీరిద్దరినీ వదిలేస్తే పర్స్ ఎక్కువగా మిగులుతుందని, టీమ్ బెంచ్ స్ట్రెంత్‌ను స్ట్రాంగ్ చేసుకోవచ్చన్నారు. అవసరమైతే వారిని మళ్లీ తక్కువ ధరకు మినీ వేలంలో తీసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.