News February 9, 2025
UPDATE: HYD: ఆస్తి కోసమే తాత హత్య!

ఆస్తి గొడవల కారణంగా వ్యాపారవేత్త జనార్దన్ రావును మనవడు హత్య చేసిన విషయం తెలిసిందే. ఇటీవల వెల్జాన్ గ్రూప్లో ఓ మనవడికి జనార్దన్ డైరెక్టర్ పోస్టును ఇచ్చాడు. తనకు ఏం ఇవ్వలేదని కోపం పెంచుకున్న కీర్తి తేజ తాతపై 73 సార్లు కత్తితో దాడి చేశాడు. అడ్డు వచ్చిన తల్లిపై కూడా అటాక్ చేసి ఏలూరుకు పారిపోయాడు. పోలీసులు నిందితుడిని ఏలూరులో అరెస్ట్ చేశారు.
Similar News
News January 18, 2026
బధిరుల క్రీడల్లో ‘పశ్చిమ’ ప్రభంజనం.. జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం

హర్యానాలో జరిగిన రాష్ట్రస్థాయి బధిరుల క్రీడా పోటీల్లో ప.గో. జిల్లా క్రీడాకారులు ప్రథమ స్థానం సాధించారని అసోసియేషన్ గౌరవాధ్యక్షులు చెరుకువాడ రంగసాయి తెలిపారు. తొమ్మిది రాష్ట్రాల నుంచి 600 మంది పాల్గొన్న ఈపోటీల్లో, జిల్లా నుంచి వెళ్లిన 16 మంది ప్రతిభ కనబరిచారన్నారు. విజేతలను ఆదివారం భీమవరంలో ఘనంగా అభినందించారు. శారీరక వైకల్యాన్ని అధిగమించి క్రీడల్లో రాణించడం అందరికీ స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు.
News January 18, 2026
T20 WC టీమ్లో ప్లేస్ మిస్.. స్పందించిన సిరాజ్

T20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కకపోవడంపై భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తొలిసారి మౌనం వీడారు. ‘నేను గత T20 ప్రపంచకప్లో ఆడాను. ఈసారి ఆడటం లేదు. ఒక ప్లేయర్కు ప్రపంచకప్లో ఆడటం అనేది ఒక కల. దేశం కోసం ఆడటం గొప్ప విషయం. ప్రస్తుతం ఎంపికైన జట్టు బాగుంది. మంచి ఫామ్లో ఉంది. వారికి నా విషెస్. ట్రోఫీ గెలవాలి’ అని అన్నారు. సౌతాఫ్రికాతో సిరీస్లోనూ లేకపోవడంపై వర్క్లోడ్ మ్యానేజ్మెంటే కారణమని వివరించారు.
News January 18, 2026
మంచిర్యాల: రేపటి ‘ప్రజావాణి’ రద్దు

మున్సిపల్ ఎన్నికల విధులు, మంత్రుల పర్యటన నేపథ్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర పరిపాలనా పరమైన పనుల ఒత్తిడి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు, దరఖాస్తుదారులు ఈ మార్పును గమనించి సహకరించాలని, కలెక్టరేట్కు రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.


