News February 9, 2025

కాగజ్ నగర్: ఈనెల 21 వరకు పలు రైళ్లు రద్దు

image

సిర్పూర్ కాగజ్ నగర్- సికింద్రాబాద్ మార్గంలో నడిచే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు ప్యాసింజర్ రైళ్లను ఈనెల 10 నుంచి 21 వరకు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కమర్షియల్ ఛీప్ అధికారి కైలాస్ ఓ ప్రకటనలో వెల్లడించారు. అదేవిధంగా భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ – సికింద్రాబాద్ రూట్లో గుంటూరు వరకు నడిచే గోల్కొండ ఎక్స్‌ప్రెస్ రైల్ లింకుతో భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రైలు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News November 5, 2025

HYD-VJA ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్

image

హైదరాబాద్-విజయవాడ మీదుగా వెళ్లే NH-65 విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రోడ్డులో 40-269KM మధ్య 229KM వరకు నాలుగు లేన్ల రోడ్డును ఆరు లేన్లకు పెంచనుంది. ఇందుకోసం భూసేకరణ చేయడానికి AP, TGల్లో అధికారులను నియమించింది. నందిగామ, కంచికచర్ల, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, ఇబ్రహీంపట్నం, విజయవాడ పరిధిలోని 34 గ్రామాల్లో భూసేకరణ చేయనున్నారు. ఈ విస్తరణకు రూ.10వేల కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయని అంచనా.

News November 5, 2025

నరసాపురం: నేషనల్ లాన్ టెన్నిస్ పోటీలకు ఏంజిలిన్ ఎంపిక

image

నరసాపురానికి చెందిన గోడి స్పార్క్ ఏంజిలిన్ జాతీయ స్థాయి లాన్ టెన్నిస్ క్రీడా పోటీలకు ఎంపికైంది. ఈ నెల 3న శ్రీకాళహస్తిలో జరిగిన రాష్ట్ర స్థాయి 14 ఏళ్ల లోపు బాలికల టెన్నిస్ విభాగంలో ఏంజిలిన్ మూడో స్థానం సాధించింది. దీంతో డిసెంబరులో హర్యానా రోహతక్‌లో జరగనున్న జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు ఆమె అర్హత సాధించింది. ప్రతిభ కనబరిచిన విద్యార్థినిని పాఠశాల యాజమాన్యం, క్రీడాభిమానులు అభినందించారు.

News November 5, 2025

పెట్టుబడులపై అవగాహన కల్పించండి: మంత్రి కొండపల్లి

image

విదేశీ పెట్టుబడులను ఆకర్షించే విధానాల అమలు, తదితర అంశాలపై అధికారులతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమరావతి సచివాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. వివిధ దేశాల్లో కీలక స్థానాల్లో ఉన్న తెలుగు ఎన్నారైలతో ప్రత్యేక క్లబ్ ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, పారిశ్రామిక విధానం వివరించి వారికి పెట్టుబడులపై అవగాహన కల్పించాలని అన్నారు.