News February 9, 2025

రేపు కలెక్టరేట్‌లో ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ

image

నంద్యాలలోని కలెక్టరేట్‌లో ఈనెల 10వ తేదీ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9:30 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి ఆయా శాఖల అధికారులు హాజరు కావాలని సూచించారు. ప్రజలు కూడా తమ సమస్యలపై అర్జీలు చేసుకోవచ్చని చెప్పారు.

Similar News

News April 4, 2026

BREAKING: క్యాతన్‌పల్లి BRS కైవసం

image

క్యాతన్‌పల్లి మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా గుడిసల సంధ్యారాణి, వైస్ ఛైర్‌పర్సన్‌గా మిట్టపల్లి సరిత ఎన్నికయ్యారు. శనివారం జరిగిన ఎన్నికకు కాంగ్రెస్ కౌన్సిలర్లు గైర్హాజరు కావడంతో, మెజారిటీ సభ్యుల మద్దతుతో వీరిద్దరూ ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి చంద్రయ్య అధికారికంగా ప్రకటించారు. దీంతో కొద్దిరోజులుగా మున్సిపాలిటీలో నెలకొన్న రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. నూతన పాలకవర్గానికి పలువురు అభినందనలు తెలిపారు.

News April 4, 2026

NZB: గిరిజన యువతకు కేరళంలో నైపుణ్య శిక్షణ

image

నిజామాబాద్‌ జిల్లాలోని గిరిజన నిరుద్యోగ యువతకు భారత్ పెట్రోలియం (BPCL) ఆధ్వర్యంలో కేరళంలోని కోచి స్కిల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ ఇచ్చేందుకు 25 సీట్లు కేటాయించారు. మే 2026లో ప్రారంభమయ్యే ఈ కోర్సులకు అర్హులైన వారు ఏప్రిల్ 10లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఆసక్తి గల యువత పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని వివరించారు.

News April 4, 2026

‘వేదమందిర్’కు పూజారులు కావలెను

image

ప్రముఖ ఆధ్యాత్మిక వేదిక ‘వేదమందిర్’ సేవలు మరింత విస్తరించేందుకు పూజారులను నియమించుకుంటోంది. లక్షలాది తెలుగు భక్తులకు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు నిపుణులైన పూజారులు కావలెను.అర్హతలు: వేద విజ్ఞానం, నిత్య పూజా విధానాలపై మంచి పట్టు, భక్తులకు పూజా విశిష్టతను, విధివిధానాలను స్పష్టంగా వివరించే నైపుణ్యంఅనుభవం: ఆలయాలు/వ్యక్తిగత పూజా కార్యక్రమాల్లో చేసి ఉండాలి
వివరాలకు <<7995978484>>7995978484<<>>