News February 9, 2025

నందవరం చౌడేశ్వరి దేవి చరిత్ర మీకు తెలుసా?

image

బనగానపల్లె(M) నందవరంలో చౌడేశ్వరి దేవి ఆలయం ఉంది. బ్రాహ్మణులకు సాక్ష్యం చెప్పడానికి అమ్మవారు వారణాసి నుంచి నందవరానికి సొరంగం ద్వారా ఒకే రోజు వచ్చారని భక్తులు నమ్ముతారు. 4వేల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం చూడటానికి చాలా భయంకరంగా ఉండేదని ఆ ఊరి పూర్వీకులు చెబుతుంటారు. ఆ తర్వాత వేరే విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆలయం ముందే సొరంగం ఉందని.. 10 మెట్లు దిగితే అమ్మవారి పాదాలు కనపడతాయని చెబుతారు.

Similar News

News March 2, 2026

కర్నూలు @ 36°C

image

కర్నూలు జిల్లాలో ఎండలు అప్పుడే మండిపోతున్నాయి. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో కర్నూలులో గరిష్ఠంగా 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

News March 2, 2026

ఉపాధి హామీలో ముంచింగిపుట్టు మండలం ఫస్ట్

image

ఉమ్మడి అల్లూరి జిల్లాలో ఉపాధి హామీ పనులు చేయడంలో ఈ ఏడాది ముంచింగిపుట్టు మండలం ప్రథమం స్థానంలో నిలిచిందని జిల్లా అధికారులు సోమవారం తెలిపారు. ఈ మండలంలో నిర్దేశించిన లక్ష్యంలో 99.4% పనులు పూర్తి కాగా, అరకువ్యాలీలో 99%, అనంతగిరిలో 89% పనులు పూర్తి అయ్యాయని వెల్లడించారు. 60%తో చివరి స్థానంలో మారేడుమిల్లి మండలం నిలించిందన్నారు. జిల్లాలో 1,08,35,415 పని దినాలు పూర్తియన్నారు.

News March 2, 2026

మార్కెట్ల బ్లడ్‌బాత్.. రూ.8లక్షల కోట్లు ఆవిరి

image

ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ యుద్ధంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో బ్లడ్‌బాత్ కొనసాగుతోంది. సెన్సెక్స్ 1498, నిఫ్టీ 455 పాయింట్ల మేర పతనమయ్యాయి. ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలు చేపడుతుండటంతో రూ.8లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లు 6శాతం, ఇండిగో, స్పైస్ జెట్ షేర్లు 5శాతం కోల్పోయాయి. డిఫెన్స్ షేర్లు పుంజుకున్నాయి.