News February 9, 2025
నెల్లూరులో టీడీపీ ముఖ్య నేతల కీలక సమావేశం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739117941200_51376060-normal-WIFI.webp)
నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం కార్యాలయంలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం ఆదివారం జరిగింది. జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, నామినేటెడ్ పోస్టులు వంటి పలు అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు ఫరూక్, ఆనం రాంనారాయణరెడ్డి, పొంగూరు నారాయణ, పోలిట్ బ్యూరో సభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు.
Similar News
News February 11, 2025
ప్రజలకు అవగాహన కల్పించాలి: నెల్లూరు కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739195366907_51908050-normal-WIFI.webp)
నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ ప్రాంగణంలో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతినెలా మూడవ శనివారం అన్నిశాఖల అధికారులు స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలన్నారు. పీఎం సూర్యఘర్ యోజన పథకంపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు.
News February 10, 2025
కందుకూరు: ఉచితంగా రూ.45 వేల ఇంజెక్షన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739195008399_51376060-normal-WIFI.webp)
గుండెపోటు వచ్చినప్పుడు వేసే అత్యంత విలువైన టెనెక్టెప్లస్ ఇంజెక్షన్ కందుకూరు ప్రభుత్వ వైద్యశాలలో అందుబాటులో ఉందని డా. తులసిరామ్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. అకస్మాత్తుగా గుండెపోటు వచ్చిన ఒక గంట లోపు టెనెక్టెప్లస్ ఇంజెక్షన్ ఇవ్వగలిగితే రోగి ప్రాణాన్ని కాపాడవచ్చన్నారు. దీని ఖరీదు రూ.40 వేల నుంచి రూ.45 వేల వరకూ ఉంటుందని, కానీ ప్రభుత్వం దీన్ని ఉచితంగా అందిస్తుందని తెలిపారు.
News February 10, 2025
ప్రజలకు అవగాహన కల్పించాలి: నెల్లూరు కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739195366907_51908050-normal-WIFI.webp)
నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ ప్రాంగణంలో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతినెలా మూడవ శనివారం అన్నిశాఖల అధికారులు స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలన్నారు. పీఎం సూర్యఘర్ యోజన పథకంపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు.