News February 10, 2025

యాదగిరిశునికి భారీగా నిత్య ఆదాయం

image

శ్రీ లక్ష్మీనరసింహస్వామి కి భారీగా నిత్య ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. ఆదివారం 2600 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా కళ్యాణ కట్ట ద్వారా రూ.1,30,000, ప్రసాద విక్రయాలు రూ.18,16,400, VIP దర్శనాలు రూ.9,30,000, బ్రేక్ దర్శనాలు రూ.3,07,500, కార్ పార్కింగ్ రూ.6,59,000, యాదరుషి నిలయం రూ.2,67,116, ప్రధాన బుకింగ్ రూ.2,47,650, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.49,00,371 ఆదాయం వచ్చింది.

Similar News

News January 11, 2026

BREAKING: ATP ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి

image

ట్రాక్టర్ బోల్తాపడటంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మద్దికేరలో ఆదివారం చోటు చేసుకుంది. వజ్రకరూరు మండలం కమలపాడుకు చెందిన బోయ కిష్టప్ప పత్తికొండకు ఇటుకల లోడుతో వెళ్తున్నాడు. కర్నూలులోని బురుజుల రోడ్డు సెల్ టవర్ వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనంపై ఉన్న అబ్దుల్ అజీజ్, శివ గాయపడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన్నట్లు ఎస్సై హరిత తెలిపారు.

News January 11, 2026

చచ్చిపోవాలనే ఆలోచనల నుంచి అలా బయటపడ్డా: మలయాళ నటి

image

డిప్రెషన్‌లో ఉన్న సమయంలో మానసిక చికిత్స తీసుకోవడం చాలా అవసరమని హీరోయిన్ పార్వతీ తిరువోతు అన్నారు. ఒకానొక సమయంలో తీవ్రమైన ఒంటరితనంతో బాధపడ్డానని, ఆ టైమ్‌లో చచ్చిపోవాలనే ఆలోచనలు కూడా వచ్చాయని తెలిపారు. థెరపీ తీసుకోవడంతో దాని నుంచి బయటపడినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తనను బాధపెట్టిన 2021లోని జనవరి, ఫిబ్రవరి నెలలను జీవితం నుంచి తీసేసినట్లు చెప్పారు. ఈ మలయాళ బ్యూటీ నాగచైతన్య ‘దూత’లో నటించారు.

News January 11, 2026

BREAKING మద్దికేరలో ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి

image

మద్దికేరలో ఆదివారం ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. పత్తికొండకు ఇటుకల లోడుతో వెళ్తుండగా బురుజుల రోడ్డు సెల్ టవర్ వద్ద ట్రాక్టర్ బోల్తా కొట్టింది. ఈ ఘటనలో అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం కమలపాడుకు చెందిన బోయ కిష్టప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనంపై ఉన్న అబ్దుల్ అజీజ్, శివ గాయపడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన్నట్లు ఎస్సై హరిత తెలిపారు.