News February 10, 2025

యాదగిరిశునికి భారీగా నిత్య ఆదాయం

image

శ్రీ లక్ష్మీనరసింహస్వామి కి భారీగా నిత్య ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. ఆదివారం 2600 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా కళ్యాణ కట్ట ద్వారా రూ.1,30,000, ప్రసాద విక్రయాలు రూ.18,16,400, VIP దర్శనాలు రూ.9,30,000, బ్రేక్ దర్శనాలు రూ.3,07,500, కార్ పార్కింగ్ రూ.6,59,000, యాదరుషి నిలయం రూ.2,67,116, ప్రధాన బుకింగ్ రూ.2,47,650, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.49,00,371 ఆదాయం వచ్చింది.

Similar News

News March 21, 2026

మేడ్చల్ జిల్లాలో ఎక్కడెక్కడ 2BHK ఇళ్లు..!

image

మేడ్చల్ జిల్లాలో పలు ప్రాంతాల్లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. రాంపల్లిలో సుమారు 3 వేలకు పైగా, దుండిగల్ ప్రాంతంలో కూడా 3 వేలకుపైగా ఇళ్లు నిర్మించారు. అహ్మద్‌గూడ, మన్సాన్‌పల్లి, శంకర్‌పల్లి, నల్లగండ్ల, నర్సింగ్, అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతాల్లో కూడా ఈ ఇళ్లు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ముప్పైకి పైగా మురికివాడల్లో గతంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయించారు.

News March 21, 2026

ఏకంగా 20 కోతుల దాడి.. అక్కడికక్కడే మృతి

image

తెలుగు రాష్ట్రాల్లో కోతుల బెడద రోజురోజుకూ తీవ్రమవుతోంది. తాజాగా కాకినాడ జిల్లాలో ఓ వృద్ధురాలి ప్రాణం తీశాయి. ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెంకు చెందిన చిన్న బుల్లెమ్మ(65) గేదెకు నీరు పెడుతుండగా కోతులు గుంపులుగా వచ్చి ఆమెపై దాడి చేశాయి. ఏకంగా 20 కోతులు ఒకేసారి మీద పడటంతో తప్పించుకొనే అవకాశం లేకుండా పోయింది. తీవ్రగాయాలతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. మరి మీ దగ్గరా కోతుల బెడద ఉందా? కామెంట్ చేయండి.

News March 21, 2026

‘యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా గళమెత్తాలి’

image

కర్నూలులోని టీజీవీ కళాక్షేత్రంలో శనివారం సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో యుద్ధోన్మాదాన్ని వ్యతిరేకిస్తూ ప్రపంచశాంతి కోరుకుంటూ సమావేశం నిర్వహించారు. సాహితీ స్రవంతి ప్రచురించిన ఉగాది ప్రత్యేక సంచిక ‘సాహిత్య ప్రస్థానం’ను ఆవిష్కరించారు. నంది అవార్డు గ్రహీత మహమ్మద్ మియా మాట్లాడుతూ.. యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా కవులు, కళాకారులు కలమెత్తి, గలమెత్తాలని పిలుపునిచ్చారు. ఇనాయతుల్లా, స్వర్ణలత పాల్గొన్నారు.