News February 10, 2025
నేడు కలెక్టరేట్లో ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ

నంద్యాలలోని కలెక్టరేట్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9:30 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి ఆయా శాఖల అధికారులు హాజరు కావాలని సూచించారు. ప్రజలు కూడా సమస్యలపై అర్జీల రూపంలో ఇవ్వాలని కోరారు.
Similar News
News November 1, 2025
ఈ క్షేత్రం నుంచే శివుడు లోకాలను కాపాడుతున్నాడట

ఉజ్జయిని మహాకాళేశ్వర్లో శివుడు స్వయంగా మహాకాలుడిగా వెలసి, కాల స్వరూపంలో కొలువై ఉన్నాడు. ఇక్కడి నుంచే శివుడు కాలానికి అధిపతిగా ఉండి, సకల లోకాలను, సమస్త జీవరాశిని రక్షిస్తున్నాడని ప్రగాఢ విశ్వాసం. శివ పురాణంలో చెప్పినట్లుగా, ఈ స్వయంభూ లింగం శక్తి ప్రవాహాలను వెలువరిస్తూ, భక్తులను అకాల మృత్యువు నుండి, కాల భయం నుండి కాపాడుతూ, నిరంతరం రక్షా కవచంగా నిలుస్తుంది. ఆ మహాదేవుడి రక్షణే మనకు రామరక్ష.
News November 1, 2025
నవీపేట్: మహిళ దారుణ హత్య?

నవీపేట్ మండలం ఫకీరాబాద్ శివారులో బాసర వెళ్లే ప్రధాన రహదారి పక్కన వివస్త్రగా గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న నవీపేట్ ఎస్ఐ తిరుపతి వివరాలు సేకరిస్తున్నారు. తల, కుడిచేయి వేళ్లు లేకుండా మహిళ మృతదేహం కనిపించింది. మహిళను హత్య చేసినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
News November 1, 2025
SRP: సింగరేణి కార్పోరేట్ జీఎం (పర్సనల్)గా మురళీధర్ రావు

సింగరేణి కార్పోరేట్ జనరల్ మేనేజర్ (పర్సనల్)గా ఏజేఎం మురళీధర్ రావు నియమితులయ్యారు. ఈ మేరకు యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. మురళీధర్ రావు జనరల్ మేనేజర్ (పర్సనల్)తో పాటు కార్పోరేట్ స్థాయిలో ఎగ్జిక్యూటివ్ ఎస్టాబ్లిష్మెంట్ సెల్, రిక్రూట్ మెంట్ సెల్కు ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వహిస్తారు. నేడు ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.


