News February 10, 2025
పార్వతీపురం: ‘వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలి’

జిల్లాలో ఎలాంటి తాగునీటి సమస్య తలెత్తకుండా పార్వతీపురం మన్యం జిల్లా యంత్రాంగం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. వేసవిలో తాగునీటి సమస్యలపై జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ప్రసాద్ ఆదివారం సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News November 9, 2025
సీఎం చేతికి తిరువూరు నివేదిక.. చంద్రబాబు ఏమన్నారంటే..!

విజయవాడ ఎంపీ చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ల వివాదంపై టీడీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యులు సీఎం చంద్రబాబుకు నివేదిక, పెన్ డ్రైవ్ను అందించారు. నేతలు బహిరంగంగా ఆరోపణలు చేసుకోవడాన్ని సీఎం సీరియస్గా తీసుకున్నారు. ఈ పంచాయితీపై తన వద్ద కూడా సమగ్ర నివేదిక ఉందని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. త్వరలో ఇద్దరు నేతలను పిలిపించి మాట్లాడతానని ఆయన వెల్లడించినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.
News November 9, 2025
ఒలింపిక్స్ 2028: IND vs PAK మ్యాచ్ లేనట్లే!

2028 నుంచి ఒలింపిక్స్లో క్రికెట్ భాగం కానున్న సంగతి తెలిసిందే. అయితే మెగా టోర్నీలు అనగానే భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఉండాల్సిందే. కానీ ఈ ఈవెంట్లో ఇరు జట్లు తలపడే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. పాకిస్థాన్కు ఒలింపిక్స్లో చోటు దక్కడం కష్టంగా మారడమే దీనికి కారణం. ఒక్కో ఖండం నుంచి ఒక్కో <<18233382>>జట్టును<<>> ఎంపిక చేయాలని ఐసీసీ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
News November 9, 2025
ఖమ్మం: చికెన్ ధరలు.. కేజీపై రూ.30 వరకు తగ్గింపు

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆదివారం చికెన్ ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత వారంతో పోలిస్తే కిలో చికెన్పై రూ.20 నుంచి రూ.30 వరకు ధరలు తగ్గాయని నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం లైవ్ చికెన్ కేజీ ధర రూ.150-180గా, స్కిన్ చికెన్ రూ.180-200గా, స్కిన్లెస్ చికెన్ ధర రూ.210-240 మధ్య పలుకుతోంది. కొనుగోలుదారులు తగ్గిన ధరలపై సంతోషం వ్యక్తం చేశారు.


