News February 10, 2025

26 ఏళ్ల క్రితం.. ఢిల్లీకి 5 ఏళ్లలో ముగ్గురు సీఎంలు!

image

ఢిల్లీలో 26 ఏళ్ల తర్వాత బీజేపీ సర్కార్ ఏర్పాటు కాబోతోంది. అయితే చివరిసారిగా (1993-1998) ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్లలో ముగ్గురు సీఎంలు పాలించారు. తొలుత మదన్‌లాల్ ఖురానా సీఎం అయ్యారు. అవినీతి ఆరోపణలు రావడంతో 27 నెలలకే రాజీనామా చేశారు. ఆ తర్వాత సాహిబ్ సింగ్ వర్మ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఉల్లి ధరలపై విమర్శలతో 31 నెలల్లో రిజైన్ చేశారు. ఆ తర్వాత సుష్మా స్వరాజ్ 52 రోజులపాటు సీఎంగా ఉన్నారు.

Similar News

News April 6, 2026

IPL: ఈరోజైనా KKR బోణీ కొడుతుందా?

image

ఐపీఎల్-2026లో ఈరోజు రా.7.30 గంటలకు కోల్‌కతా వేదికగా KKR, PBKS తలపడనున్నాయి. టోర్నీ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 35 మ్యాచులు ఆడగా 21 విజయాలతో KKR పైచేయి సాధించింది. కానీ ప్రస్తుత సీజన్‌లో KKR ఫామ్‌లో లేదు. ఇప్పటివరకు రెండు మ్యాచులాడి రెండింట్లోనూ ఓడింది. అటు పంజాబ్ ఆడిన 2 మ్యాచుల్లోనూ గెలిచి అన్ని విభాగాల్లో దూసుకుపోతోంది. మరి ఈరోజు విజయం ఎవరిదో కామెంట్ చేయండి.

News April 6, 2026

లేఆఫ్స్‌ వద్దు.. రీస్కిల్లింగ్‌పై దృష్టి పెట్టండి: NITES

image

టెక్ కంపెనీలు లేఆఫ్స్‌కు బదులు ఉద్యోగుల స్కిల్స్‌ను పెంచడంపై దృష్టి పెట్టాలని IT ఉద్యోగుల సంఘం ‘నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్’ అభిప్రాయపడింది. లేఆఫ్స్‌ను చివరి ఆప్షన్‌గా చూడాలంది. ప్రైవేట్ సెక్టార్‌లో లే ఆఫ్స్, నోటీస్ పీరియడ్స్, పరిహారాలకు సంబంధించి స్పష్టమైన నిబంధనలు లేవని, ప్రభుత్వాలు జోక్యం చేసుకొని ఉద్యోగుల హక్కులను కాపాడాలని సంఘం ప్రెసిడెంట్ హర్‌ప్రీత్ సింగ్ సలూజా కోరారు.

News April 6, 2026

ఒక్కరోజే 51 లక్షల సిలిండర్ల విక్రయం: కేంద్రం

image

పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో మార్చి 23 నుంచి ఇప్పటివరకు 5 కేజీల సిలిండర్లు 6.6 లక్షలు అమ్ముడైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో ఎలాంటి కొరత లేదని, ఏప్రిల్ 4న ఒక్క రోజే 51 లక్షల గృహ వినియోగ సిలిండర్లు డెలివరీ అయ్యాయని తెలిపింది. మార్చి నుంచి ఇప్పటివరకు అక్రమంగా నిల్వ చేసిన 50వేలకు పైగా సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.