News February 10, 2025
మన్యంకొండ వెంకటేశ్వర స్వామి హంస వాహన సేవ

పాలమూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 3వ రోజు మాఘశుద్ధ ద్వాదశి ఆదివారం రాత్రి స్వామివారు హంస వాహనంపై విహరించారు. సతీ సమేతంగా హంస వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తుల్లో నెలకొన్న అహంభావాన్ని తొలగించి జ్ఞాన సిద్ధి, బ్రహ్మ పాద ప్రాప్తి కలిగించేందుకు స్వామివారు హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.
Similar News
News March 25, 2026
నారా లోకేశ్కు ధన్యవాదాలు తెలిపిన RDT నిర్వాహకులు

పేదల సేవలో ముందుండే RDT సంస్థకు ఏర్పడిన అడ్డంకులను తొలగించేందుకు మంత్రి లోకేశ్ కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి FCRA పునరుద్ధరణకు అనుమతులు ఇప్పించడంలో కీలక పాత్ర పోషించారని RDT నిర్వాహకులు మాంచో ఫెర్రర్ అన్నారు. దీంతో వారు మంత్రి నారా లోకేశ్కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఓ మంత్రికి చెబుతున్న కృతజ్ఞత కాదని.. RDT తరపున లక్షలాది ప్రజలకు ఉపయోగపడిన మంచి మనిషికి అందిస్తున్న ఆశీస్సులని వివరించారు.
News March 25, 2026
సుల్తానాబాద్ కేంద్రంగా కొత్త నియోజకవర్గం..?

జిల్లాలో ప్రస్తుతం రామగుండం, పెద్దపల్లి, మంథని నియోజకవర్గాలు ఉన్నాయి. సుల్తానాబాద్ కేంద్రంగా ధర్మారం, ఎలిగేడు, ఓదెల, జూలపల్లి మండలాలతో కొత్త నియోజకవర్గం ఏర్పడుతుందనే చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. పెద్దపల్లి, కాల్వశ్రీరాంపూర్, అంతర్గాం, పాలకుర్తి(పెద్దపల్లి), రామగుండం మున్సిపాలిటీ కేంద్రంగా ఒక నియోజకవర్గం, కమాన్ పూర్, రామగిరి, ముత్తారం మంథని మండలాలతో నియోజకవర్గాలు ఏర్పడతాయనే చర్చ SMలో నడుస్తోంది.
News March 25, 2026
మూడు నియోజవర్గాలుగా ‘రాజన్న సిరిసిల్ల’..?

జిల్లాలో ప్రస్తుతం సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే, ఎల్లారెడ్డిపేట కేంద్రంగా గంభీరావుపేట, ముస్తాబాద్, వీర్నపల్లి, కోనరావుపేట మండలాలతో మరో నియోజకవర్గం ఏర్పడుతుందనే చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. వేములవాడ, వేములవాడ రూరల్, బోయినపల్లి, చందుర్తి, రుద్రంగి మండలాలతో వేములవాడ నియోజకవర్గం, సిరిసిల్ల, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాలతో సిరిసిల్ల నియోజకవర్గం ఉంటుందని ప్రచారం జరుగుతోంది.


