News February 10, 2025
మన్యంకొండ వెంకటేశ్వర స్వామి హంస వాహన సేవ

పాలమూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 3వ రోజు మాఘశుద్ధ ద్వాదశి ఆదివారం రాత్రి స్వామివారు హంస వాహనంపై విహరించారు. సతీ సమేతంగా హంస వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తుల్లో నెలకొన్న అహంభావాన్ని తొలగించి జ్ఞాన సిద్ధి, బ్రహ్మ పాద ప్రాప్తి కలిగించేందుకు స్వామివారు హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.
Similar News
News April 1, 2026
MBNR: రేపు గ్రామ, వార్డు సభలు.. ప్రభుత్వ సూచనలు

1) ఉ.10గంటలకు రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ ఆలపించి, సభను ప్రారంభించాలి.
2) గ్రామసభలో సర్పంచ్తోపాటు పాలకవర్గం, వార్డు సభలో మున్సిపల్ ఛైర్మన్తోపాటు పాలకవర్గం, అధికారులు, ప్రజలు హాజరుకావాలి.
3) CMసందేశాన్ని చదివి వినిపించాలి.
4) ప్రభుత్వ విజయాలు, 6గ్యారంటీలపై అవగాహన కల్పించి, పథకాలకు అర్హులను గుర్తించాలి.
5) ప్రజాసమస్యల కోసం ఫిర్యాదుల బాక్సులను ఏర్పాటు చేయాలి.. పరిష్కారాలపై కార్యాచరణ రూపొందించాలి.
News April 1, 2026
MBNR: సల్కర్పేటలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

మహబూబ్ నగర్ జిల్లాలో వేసవి ఎండల తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో గండీడ్ మండలం సల్కర్పేటలో అత్యధికంగా 37.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 37.2, దేవరకద్ర 35.6, చిన్న చింతకుంట మండలం వడ్డేమాన్ 35.3, మహమ్మదాబాద్ 35.2, నవాబుపేట 35.0, మహబూబ్ నగర్ అర్బన్, కౌకుంట్ల 34.9, అడ్డాకుల, నవాబుపేట మండలం కొల్లూరు 34.8, భూత్పూర్ 34.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
News April 1, 2026
MBNR: ఇప్ప చెట్ల పెంపకానికి 52 మంది ఎమ్మెల్యేల మద్దతు

తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ‘ఇప్ప’ (మహువా) చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించాలన్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చొరవకు ఎమ్మెల్యేలు 52 MLAలు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కరువును ఇప్ప చెట్లు తట్టుకోగలవని, మొక్కల పెంపకం విస్తరించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందన్నారు. గ్రామీణ, గిరిజన తండాలలో ప్రజల ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. గిరిజనులకు జీవనోపాధి దొరుకుతుందన్నారు.


