News February 10, 2025

నేడు శ్రీశైలానికి మంత్రుల బృందం

image

శ్రీశైల క్షేత్రంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 23న సీఎం చంద్రబాబు శ్రీశైలానికి రానున్నారు. ఈ నేపథ్యంలో నేడు మంత్రుల బృందం క్షేత్రానికి చేరుకుని ఏర్పాట్లను పరిశీలించనున్నారు. మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, ఎన్ఎండీ ఫరూక్, అనిత, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి అలాగే నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, స్థానిక ఎమ్మెల్యే బుడ్డా ఏర్పాట్లు పరిశీలిస్తారు.

Similar News

News March 17, 2026

MDK: 428 అంగన్వాడీలకు మహార్దశ

image

అంగన్వాడీలకు మహర్దశ రానుంది. అసౌకర్యాలకు నిలయంగా మారిన అంగన్వాడీలు బలోపేతం కానున్నాయి. తెలంగాణలో 5008 అంగన్‌వాడీలను ‘సక్షం’లో భాగంగా ఆధునికీకరించనున్నట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా మెదక్‌లో 130, సంగారెడ్డిలో 298 అంగన్వాడీలు సక్షం సెంటర్లుగా ఎంపికయ్యాయి. ఎంపికైన కేంద్రాల్లో మెరుగైన వసతుల కల్పనతో పాటు డిజిటల్ విద్యా బోధన, LED స్క్రీన్ల ఏర్పాటు, పోషకాహారం అందనుంది.

News March 17, 2026

పెరగనున్న కార్ల ధరలు!

image

కార్ల కంపెనీలు మరోసారి షాక్ ఇవ్వనున్నాయి. తమ వెహికల్స్ ధరలు పెంచేందుకు రెడీ అవుతున్నాయి. రూపాయి పతనం, రా మెటీరియల్ ఖర్చులు ఎక్కువ కావడంతో ఇప్పటికే జనవరిలో ఓసారి పెంచాయి. తాజాగా వచ్చే నెలలో మెర్సిడెస్ బెంజ్, ఆడి 2 శాతం చొప్పున, టాటా సంస్థ 1.5 శాతం పెంచనున్నాయి. హ్యుందాయ్, మారుతీ సుజుకీ సహా మిగతా ప్రధాన సంస్థలు కూడా ధరలు సవరించాలని భావిస్తున్నాయి.

News March 17, 2026

ఫోన్ పోయిందా అయితే ఇలా చేయండి: VZM ఎస్పీ

image

మొబైల్ ఫోన్ పోయినా, దొంగతనం జరిగినా సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి లేదా ఆన్‌లైన్‌లో CEIR పోర్టల్ ద్వారా నమోదు చేయవచ్చని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ సోమవారం తెలిపారు. సమీప పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేసి మొబైల్ ట్రాకింగ్ చర్యలు చేపట్టవచ్చని చెప్పారు. ప్రజలు తమ మొబైల్ IMEI నంబర్‌ను భద్రంగా ఉంచుకోవాలని, అనుమానాస్పద వ్యక్తుల వద్ద నుంచి సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనుగోలు చేయవద్దని సూచించారు.