News February 10, 2025

NGKL: ఎంపీడీవో కార్యాలయంలో వ్యక్తి దహనం

image

బిజినేపల్లిలో కొందరు దుండగులు ఒకరి మృతదేహాన్ని దహనం చేసిన ఘటన నిన్న చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. పాత ఎంపీడీవో కార్యాలయంలో నిన్న మధ్యాహ్నం మంటలు రావటంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించటంతో మంటలు అదుపు చేశారు. అక్కడ వారికి ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది. ఆదివారం కావటంతో కార్యాలయంలో మృతదేహానికి నిప్పంటించి దహనం చేసి ఉంటారని స్థానికులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News February 25, 2026

జడ్చర్ల: అధికారుల నిర్లక్ష్యం.. ప్రశ్నాపత్రం తారుమారు

image

జడ్చర్ల పట్టణంలోని ఓ ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రంలో విద్యార్థికి సంస్కృతం సబ్జెక్టు పేపర్‌కు బదులుగా హిందీ ప్రశ్నాపత్రాన్ని అందజేశారు. పరీక్ష తొందరలో విద్యార్థి తనకు తోచిన జవాబులు రాశాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న తండ్రి కళాశాలకు వెళ్లి అధికారులను ప్రశ్నించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 25, 2026

పాలమూరు:టెన్త్ పరీక్షలు..13,217 మంది విద్యార్థులు

image

మహబూబ్ నగర్ జిల్లాలో పదవ తరగతి పరీక్షలకు 60 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లాలో రెగ్యులర్, ప్రయివేట్ విద్యార్థులు మొత్తం కలుపుకొని 13,217 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి వెల్లడించారు. పరీక్ష కేంద్రం పరిధిలో 163 బీఎన్ఎస్ఎస్ విధించాలని, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఆయా శాఖల అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.

News February 25, 2026

MBNR: పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

image

మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి పరీక్షల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మహబూబ్‌నగర్ కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. పదో తరగతి పరీక్ష ఏర్పాట్ల విషయమై జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాలలోకి ఎటువంటి సెల్‌ఫోన్లు, గాడ్జెట్‌లకు అనుమతి లేదన్నారు. పరీక్ష ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగుతుందన్నారు.