News February 10, 2025
NGKL: ఎంపీడీవో కార్యాలయంలో వ్యక్తి దహనం

బిజినేపల్లిలో కొందరు దుండగులు ఒకరి మృతదేహాన్ని దహనం చేసిన ఘటన నిన్న చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. పాత ఎంపీడీవో కార్యాలయంలో నిన్న మధ్యాహ్నం మంటలు రావటంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించటంతో మంటలు అదుపు చేశారు. అక్కడ వారికి ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది. ఆదివారం కావటంతో కార్యాలయంలో మృతదేహానికి నిప్పంటించి దహనం చేసి ఉంటారని స్థానికులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News March 22, 2026
IPLలో అన్సోల్డ్.. కట్ చేస్తే 69 బంతుల్లో 195* రన్స్

అయోధ్య T20 ప్రీమియర్ లీగ్లో స్వస్తిక్ చికారా విధ్వంసం సృష్టించారు. గోమతి థండర్ తరఫున ఆడిన ఆయన 69 బంతుల్లోనే 195* రన్స్ చేశారు. ఇందులో 21 సిక్సర్లు, 11 ఫోర్లు ఉన్నాయి. మరో ప్లేయర్ ప్రియాంశు 54 బంతుల్లో సెంచరీ చేశారు. దీంతో ఆ టీమ్ 20 ఓవర్లలో 307/0 స్కోర్ చేసింది. హిండన్ టైటాన్స్ 218 రన్స్కే ఆలౌటైంది. స్వస్తిక్ గతంలో DC, RCB టీమ్లలో ఉన్నా ఒక్క మ్యాచూ ఆడలేదు. 2026 వేలంలో అన్సోల్డ్గా మిగిలారు.
News March 22, 2026
రేషన్కార్డుదారులకు రేపటి నుంచి కిరోసిన్

AP: గ్యాస్ కొరత నేపథ్యంలో గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం రేపటి నుంచి లీటర్ చొప్పున కిరోసిన్ పంపిణీ చేయనుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్రానికి 2,800 కిలో లీటర్ల(ఒక కిలో లీటర్= వెయ్యి లీటర్లు) కిరోసిన్ను అందించిన విషయం తెలిసిందే. APని కిరోసిన్ రహిత రాష్ట్రంగా మార్చినప్పటికీ సంక్షోభ పరిస్థితుల కారణంగా మళ్లీ సరఫరా చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
News March 22, 2026
మదనపల్లెలో రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

మదనపల్లెలో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం మదనపల్లె నూతన జిల్లా పోలీసు కార్యాలయంలోనే నిర్వహిస్తామని, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదివారం తెలిపారు. ఫిర్యాదుదారులు నేరుగా విన్నవించుకునేందుకు వీలుగా, ఆధునిక వసతులతో కూడిన నూతన కార్యాలయంలోనే ఇకపై ప్రతి సోమవారం ఫిర్యాదుల స్వీకరణ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ స్వయంగా మాట్లాడతారని తెలిపారు.


