News February 10, 2025
NGKL: ఎంపీడీవో కార్యాలయంలో వ్యక్తి దహనం

బిజినేపల్లిలో కొందరు దుండగులు ఒకరి మృతదేహాన్ని దహనం చేసిన ఘటన నిన్న చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. పాత ఎంపీడీవో కార్యాలయంలో నిన్న మధ్యాహ్నం మంటలు రావటంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించటంతో మంటలు అదుపు చేశారు. అక్కడ వారికి ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది. ఆదివారం కావటంతో కార్యాలయంలో మృతదేహానికి నిప్పంటించి దహనం చేసి ఉంటారని స్థానికులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News January 8, 2026
నంద్యాలలో వచ్చే నెలలో ఇంటర్నేషనల్ రేటింగ్ చెస్ టోర్నీ

వచ్చే నెల 21, 22వ తేదీల్లో నంద్యాలలో ఇంటర్నేషనల్ రేటింగ్ చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు చెస్ సంఘం నంద్యాల జిల్లా ఛైర్మన్ రామకృష్ణారెడ్డి, అధ్యక్షుడు రవికృష్ణ తెలిపారు. పట్టణంలో అంతర్జాతీయ స్థాయిలో చదరంగం పోటీలు నిర్వహించడం ఇదే మొదటిసారి అని వారన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ఫిబ్రవరి 15వ తేదీ లోపు www.apchess.orgలో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.
News January 8, 2026
స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో బాపట్ల ముందుండాలి: కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర విజన్-2047 లక్ష్యాలను సాధించడంలో జిల్లా ముందంజలో ఉండాలని బాపట్ల కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేసి కీలక ప్రగతి సూచికల్లో (KPIs) మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు.
News January 8, 2026
త్వరగా పరిష్కారం చూపండి: కలెక్టర్

అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా రెవెన్యూ సమస్యలకు త్వరితగతిన, నాణ్యత కలిగిన పరిష్కారాన్ని చూపించాలని తహశీల్దార్లను కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో కర్నూలు డివిజన్లో రెవెన్యూ క్లినిక్, రెవెన్యూ స్పెషల్ క్యాంప్ల ద్వారా వచ్చిన అర్జీల పరిష్కారంపై సమావేశం నిర్వహించారు. వచ్చిన అర్జీలకు వెంటనే నోటీసులు ఇచ్చి, నిర్దేశిత గడువు లోపు వాటిని పరిష్కరించాన్నారు.


