News February 10, 2025

తిరుమల కల్తీ నెయ్యి సరఫరాలో నలుగురు అరెస్టు.. ఏ1 ఎవరో ..?

image

తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా కేసులో నలుగురు కీలక నిందితులను సిట్ ఆదివారం రాత్రి అరెస్ట్ చేసింది. బోలేబాబా ఆర్గానిక్ డెయిరీ డైరెక్టర్లు ఏ4 విపిన్ జైన్, ఏ3 పోమిల్ జైన్, వైష్ణవి డెయిరీ సీఈవో వినయ్ కాంత్, ఏ2 ఏఆర్ డెయిరీ ఎండీ రాజశేఖరన్‌లను అరెస్ట్ చేశారు. ఏ1 నిందితుడెవరో ఇంకా నిర్ధారించలేదు. టీటీడీలో పనిచేసిన కీలక అధికారి లేదా బోర్డులోని కీలక వ్యక్తిని కేసులో చేర్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

Similar News

News December 27, 2025

నేచురల్ AC కారిడార్‌‌గా మూసీ!

image

మూసీ పునరుద్ధరణలో ప్రభుత్వం ఇప్పుడు సింగపూర్ ‘ABC’ (Active, Beautiful, Clean) మంత్రాన్ని జపిస్తోంది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. మూసీని కేవలం పర్యాటక ప్రాంతంగానే కాకుండా నగరాన్ని చల్లబరిచే ఒక భారీ ‘నేచురల్ AC’ కారిడార్‌గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. నదికి ఇరువైపులా అత్యాధునిక ‘వర్టికల్ ఫారెస్ట్స్’ పెంచడం ద్వారా ఉష్ణోగ్రతలను గణనీయంగా తగ్గించేలా మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోంది.

News December 27, 2025

జైలులో గోవిందమాల వేసిన చెవిరెడ్డి

image

మద్యం కేసులో అరెస్ట్ అయిన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి 190రోజులుగా విజయవాడ జైలులో ఉన్నారు. కోర్టు అనుమతితో ఆయన శుక్రవారం గోవిందమాల స్వీకరించారు. వైకుంఠ ఏకాదశికి 7రోజుల ముందే మాల వేయడం ఆయనకు ఆనవాయితీ. జైలులోని ఆలయంలో పూజలు చేసి మాల వేశారు. చేయని తప్పుకు నిర్భందించినా శ్రీనివాసునిపై తన భక్తి చెక్కుచెదరలేదని చెవిరెడ్డి చెప్పారు.

News December 27, 2025

అభివృద్ధి ఎక్కడ? కేవలం బూతుల పురాణమేనా?: బండి

image

కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలంగాణ రాజకీయాలపై X వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధాన్ని ఆయన “వర్బల్ డయేరియా”గా అభివర్ణించారు. నాయకులు అభివృద్ధిని విస్మరించి, బూతులు తిట్టుకుంటూ రాజకీయాలను దిగజారుస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి, రైతుల మద్దతు, ఉద్యోగాల గురించి మాట్లాడకుండా కేవలం ఒకరినొకరు తిట్టుకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.