News February 10, 2025

తిరుమల కల్తీ నెయ్యి సరఫరాలో నలుగురు అరెస్టు.. ఏ1 ఎవరో ..?

image

తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా కేసులో నలుగురు కీలక నిందితులను సిట్ ఆదివారం రాత్రి అరెస్ట్ చేసింది. బోలేబాబా ఆర్గానిక్ డెయిరీ డైరెక్టర్లు ఏ4 విపిన్ జైన్, ఏ3 పోమిల్ జైన్, వైష్ణవి డెయిరీ సీఈవో వినయ్ కాంత్, ఏ2 ఏఆర్ డెయిరీ ఎండీ రాజశేఖరన్‌లను అరెస్ట్ చేశారు. ఏ1 నిందితుడెవరో ఇంకా నిర్ధారించలేదు. టీటీడీలో పనిచేసిన కీలక అధికారి లేదా బోర్డులోని కీలక వ్యక్తిని కేసులో చేర్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

Similar News

News March 25, 2026

ఉద్యోగ క్రీడాకారులను అభినందించిన కలెక్టర్

image

జాతీయస్థాయి సివిల్ సర్వీసెస్ ఖోఖో పోటీలలో ప్రతిభ చూపిన జిల్లా ఉద్యోగుల క్రీడాకారులను కలెక్టర్ సుమిత్ కుమార్ అభినందించారు. మంగళవారం రాత్రి తన ఛాంబర్‌లో వారికి పతకాలను అందజేశారు. ఈనెల 19 నుంచి 22వ తేదీ వరకు పూణేలో జరిగిన జాతీయ స్థాయి సివిల్ సర్వీస్ ఖోఖో పోటీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టు విశేష ప్రతిభ కనబరచి కాంస్య పతకాన్ని సాధించింది.

News March 25, 2026

చిత్తూరు: మామిడి దిగుబడిపై అధికారులు అంచనా

image

జిల్లాలో మామిడి దిగుబడి అంచనాను ఉద్యాన శాఖ అధికారులు పూర్తి చేశారు. తోతాపురి 40024 హెక్టార్లకు 483981 మెట్రిక్ టన్నుల దిగుబడి రావచ్చునని అంచనా వేశారు. అలాగే బేనీషా 6856 హెక్టార్లకు 42242 టన్నులు, కాదర్ 2702 హెక్టార్లకు 18834 టన్నులు, నీలం 5178 హెక్టార్లకు 42242 టన్నులు, మల్లిక 1349 హెక్టార్లకు 10444 టన్నులు, ఇతర రకం 3217 హెక్టార్లకు 23509 టన్నుల దిగుబడి వచ్చే ఛాన్స్ ఉందని వివరించారు.

News March 25, 2026

కుప్పం: అంగన్వాడీలో పేలిన కుక్కర్

image

కుప్పం మున్సిపాలిటీ తంబిగానిపల్లి SC కాలనీ అంగన్వాడీ కేంద్రంలో కుక్కర్ పేలి అంగన్వాడీ కార్యకర్త సుమతి గాయపడ్డారు. మధ్యాహ్నం వంట చేసేందుకు స్టవ్ మీద కుక్కర్ పెట్టారు. కాసేపు తర్వాత కుక్కర్ విజిల్స్ రాగా స్టౌ ఆఫ్ చేసి కుక్కర్‌ను పక్కకు తీసి దాన్ని ఓపెన్ చేసే క్రమంలో పేలడంతో కుక్కర్‌లోని వేడి నీళ్లతో పాటు పప్పు ఆమె ముఖంపై పడింది. దీంతో సుమతిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.