News February 10, 2025

HYD: సచివాలయంలో నేడు సీఎం సమీక్ష

image

సచివాలయంలో నేడు సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. సచివాలయంలోని తన పరిధిలోని శాఖలపై సీఎం సమీక్షించి, ఆయా శాఖల పనితీరు, పని స్వభావం గురించి అధికారులతో చర్చించనున్నారు. తన పరిధిలో ఉన్న ఉద్యోగులకు కీలక ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉందని సచివాలయ వర్గాల సమాచారం.

Similar News

News April 3, 2026

HYD: దారుణ హత్య.. మూసీలో ఎముకల లభ్యం

image

HYD శివారు మేడిపల్లి PS పరిధిలో అదృశ్యమైన వ్యక్తి హత్యకు గురయ్యాడు. చెంగిచర్ల గణేష్‌నగర్‌కు చెందిన పండిపాటి బక్కయ్య (33) గతేడాది DEC30న పనికి వెళ్లి కనిపించకుండా పోయాడు. JAN21న మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. కొర్రెముల మూసీ వంతెన వద్ద సంచిలో ఎముకలు స్వాధీనం చేసుకున్నారు. పని ప్రాంత వివాదమే హత్యకు కారణమని నిర్ధారించారు.

News April 3, 2026

HYD‌లో ట్రాఫిక్ జామ్.. కారణం ఇదే!

image

ఐటీ కారిడార్‌లోని సైబర్ టవర్స్ వద్ద మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన సర్వేలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. ఉదయం వేళ కేవలం ఒక గంటలోనే ఏకంగా 10,138 మంది ఒంటరి వాహనదారులు (సింగిల్ రైడర్లు) వెళ్లినట్లు గుర్తించారు. డబుల్ రైడర్లు 3,584 మంది మాత్రమే ఉన్నారని తేలింది. ఈ స్థాయిలో సింగిల్ రైడర్ల సంఖ్య పెరగడం వల్లే రోడ్లపై తీవ్ర ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయని అధికారులు స్పష్టం చేశారు.

News April 3, 2026

HYD: ఇద్దరు IAS అధికారులకు పోస్టింగ్‌లు

image

తెలంగాణలో ఇద్దరు ఐఏఎస్ అధికారులకు పోస్టులు కేటాయిస్తూ సీఎస్ రామకృష్ణ రావు ఉత్తర్వులు జారీ చేశారు. వాణి ప్రసాద్‌ను యువజన అభివృద్ధి, పర్యాటకం, సంస్కృతి శాఖకు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమించారు. జయేష్ రంజన్ అర్బన్ డెవలప్మెంట్ శాఖలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కొనసాగుతూ.. క్రీడా శాఖకు అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.