News February 10, 2025
పెగడపల్లి: రోడ్డు ప్రమాదంలో రైతుకు తీవ్ర గాయాలు

పెగడపల్లి మండల కేంద్రంలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఏడు మోటలపల్లికి చెందిన కొత్తపల్లి నరసింహ చారికి తీవ్ర గాయాలయ్యాయని ఎస్ఐ రవికిరణ్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో పశువులను కట్టివేసి రోడ్డుపై నడుస్తుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొంది. ఈ ఘనటలో గాయాలు కాగా.. వెంటనే అతన్ని అంబులెన్స్లో జగిత్యాలకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News February 25, 2026
నిజామాబాద్: కో-ఆప్షన్ పదవులపై ఆశావహుల కన్ను

మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో కార్పొరేటర్లతో సమాన హోదా కలిగిన కో-ఆప్షన్ సభ్యుల పదవుల కోసం నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నిజామాబాద్ కార్పొరేషన్లో ఐదుగురికి, మున్సిపాలిటీల్లో నలుగురికి ఈ అవకాశం ఉండనుంది. తెలంగాణ మున్సిపల్ చట్టం 2019 ప్రకారం 45 రోజుల్లోనే ఈ పదవులను భర్తీ చేయాల్సి ఉంటుంది. త్వరలో నోటిఫికేషన్ వెలువడనుండటంతో ఆశావహులు ముఖ్యనేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
News February 25, 2026
జనగామ జిల్లాలో 16 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు

జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు మొత్తం 16 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా జనగామ పట్టణంలో 8 కేంద్రాలుండగా, స్టేషన్ ఘనపూర్లో 3, నర్మేట, జఫర్గఢ్, పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాల్లో ఒక్కో కేంద్రం చొప్పున కేటాయించారు. పరీక్షల పర్యవేక్షణకు 16 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 16 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను నియమించారు.
News February 25, 2026
మా రాష్ట్రం పేరును ‘బంగ్లా’గా ఎందుకు మార్చట్లేదు: మమత

కేరళ పేరును <<19227139>>కేరళంగా<<>> మార్చడాన్ని WB సీఎం మమత స్వాగతించారు. తమ రాష్ట్రం పేరును ‘బంగ్లా’గా మార్చాలని కేంద్రానికి 3సార్లు విన్నవించినా పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. తమ కల్చర్ను పరిగణనలోకి తీసుకొని ‘బంగ్లా’ పేరు పెట్టాలనుకున్నట్లు తెలిపారు. ‘మా విద్యార్థులు పరీక్షకు వెళితే అక్షర క్రమంలో(West Bengal) చివర్లో కూర్చోవాలి. CMగా నాకూ ఇదే పరిస్థితి. మేమెందుకు చివర్లోనే ఉండాలి’ అని ప్రశ్నించారు.


