News February 10, 2025
వికారాబాద్: ప్రత్యేక పాలనకే మొగ్గు!

PACS గడువు ఈ నెల 20తో ముగియనుంది. జిల్లాలో 22 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉండగా.. మరో 10 PACS కొత్తగా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో PACS ప్రత్యేక అధికారుల పాలనకే ప్రభుత్వం మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు సమాచారం. 14 Feb 2020న సహకార సంఘాలకు ఎన్నికలు జరగ్గా, అదే నెలలో 17 నుంచి 19వ తేదీ వరకు నూతన పాలక వర్గాలను ఎన్నుకున్నారు.
Similar News
News July 4, 2025
మహబూబాబాద్ జిల్లాకు 16 పతకాలు

భద్రాద్రి జోనల్ పరిధిలో జరిగిన పోలీస్ డ్యూటీ మీట్లో జిల్లాకు 4 బంగారు, 9 రజత, 3 కాంస్య పతకాలు లభించాయి. బాంబు స్క్వాడ్ విభాగంలో పీసీ రామయ్యకు ( గోల్డ్ 01, సిల్వర్ 01), అశోక్ పీసీ(గోల్డ్ 01, సిల్వర్ 01), పీసీ మహేశ్ (గోల్డ్ 01, సిల్వర్ 01), పీసీ మహేశ్ (సిల్వర్ 01) మొత్తం 16 మెడల్స్ సాధించారు. ఈ మెడల్స్ను వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ పోలీసులకు అందజేశారు.
News July 4, 2025
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాల్లో ముగిశాయి. sensex 193 పాయింట్ల లాభంతో 83,432 వద్ద స్థిరపడింది. nifty 55 పాయింట్లు లాభపడి 25,461 వద్ద ట్రేడింగ్ ముగించింది. బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, డా.రెడ్డీస్ ల్యాబ్స్, ఐసీఐసీఐ, విప్రో, అల్ట్రాటెక్, రిలయన్స్, బజాజ్ ఆటో, ఎస్బీఐ షేర్లు లాభపడ్డాయి. టాటా స్టీల్, టెక్ మహీంద్రా, మారుతీ సుజుకి, ఇండస్ ఇండ్, అదానీ పోర్ట్స్ M&M షేర్లు నష్టపోయాయి.
News July 4, 2025
ASF: ‘మహనీయుల ఆశయ సాధనకు కృషి చేయాలి’

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, అమరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి, ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతిని ఆసీఫాబాద్ కలెక్టరేట్లో నిర్వహించారు. ఇక్కడ ఇరువురి చిత్రపటాలకు ASF కలెక్టర్ వెంకటేష్ ధౌత్రే, ఎమ్మెల్యే కోవాలక్ష్మి నివాళులర్పించారు. మహనీయుల సేవలను స్మరించుకుంటూ, వారి ఆశయ సాధనకు కృషి చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జేసీ డేవిడ్, జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులున్నారు.