News February 10, 2025

శంషాబాద్ నుంచి కుంభమేళాకు తరలివెళ్తున్న ప్రజలు

image

ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు భారీగా ప్రజలు తరలివెళ్తున్నారు. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అధికారులు వృద్ధులు, దివ్యాంగుల కోసం చక్రాల కుర్చీలను ఏర్పాటు చేశారు. ఆదివారం అంతర్జాతీయ విమాన సర్వీసులో 84,593 మంది ప్రయాణించినట్లు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు.

Similar News

News February 11, 2025

HYD: మూసీకి రూ.37.50 కోట్లు కేటాయింపు!

image

మూసీ నది అభివృద్ధి సంస్థకు రూ.37.50 కోట్లు కేటాయిస్తూ పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. మూసీ ప్రక్షాళన అభివృద్ధిలో భాగంగా నిర్వాసితులను తరలించేందుకు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మొత్తం 1,500 కుటుంబాలను గుర్తించారు. ఒక్కో కుటుంబానికి రూ.25,000 అందించనున్నట్లు పేర్కొన్నారు.

News February 11, 2025

HYD: ట్యాంకర్ బుకింగ్ కోసం కాల్ చేయండి

image

వేసవి దృష్ట్యా జలమండలి అధికారులు ముందస్తు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఏ ప్రాంతంలో ట్యాంకర్లు ఎక్కువగా బుక్ చేస్తున్నారో క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. ఆ ప్రాంతాల జాబితాను స్థానిక అధికారులకు అందించి అదనపు ఫిల్లింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వేసవిలో బుక్ చేసుకున్న రోజే ట్యాంకర్ వస్తుందని, బుకింగ్ కోసం 155313కి కాల్ చేయాలని సూచించారు. దళారులను నమ్మి మోసపొవద్దని హెచ్చరించారు.

News February 11, 2025

HYD: నేటి నుంచి భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్

image

HYD ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త తెలిపారు. 11 రోజులపాటు రద్దవుతున్నట్లు ప్రకటించిన భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరించినట్లు రైల్వే అధికారి శ్రీధర్ ఉత్తర్వులు జారీచేశారు. నేడు SECలో బయల్దేరి భువనగిరి, కాజీపేట్, పెద్దపల్లి, కాగజ్‌నగర్ వెళ్తుంది. మళ్లీ 15న సికింద్రాబాద్ చేరుకుంటుందని అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

error: Content is protected !!