News February 10, 2025

ఆసిఫాబాద్: నేటి నుంచి పలు రైళ్లు రద్దు

image

మంచిర్యాల, కొమురం భీమ్ ఆసిఫాబాద్‌ జిల్లాల్లోని సిర్పూర్ కాగజ్‌ నగర్‌, రెబ్బెన, బెల్లంపల్లి, మంచిర్యాల రైల్వే స్టేషన్ల మీదుగా వివిధ ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లు నేటి నుంచి 20వ తేదీ వరకు రద్దయ్యాయి. ఖమ్మం రైల్వే స్టేషన్‌ వద్ద నాన్‌ ఇంటర్‌ లాకింగ్‌ పనుల కారణంగా ఈ రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని కోరారు.

Similar News

News September 19, 2025

సిరిసిల్ల కలెక్టర్‌కు ప్రభుత్వం నోటీసులు..!

image

ప్రజాపాలన దినోత్సవం వేళ జెండావిష్కరణ సమయానికి రాకుండా SRCL కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రొటోకాల్ పాటించలేదని <<17746715>>MLA ఆది ఆయనపై<<>> సీరియసైన విషయం తెలిసిందే. కాగా, దీనిపై ప్రభుత్వం స్పందించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS) K.రామకృష్ణారావు కలెక్టర్‌కు సంజాయిషీ నోటీసులు పంపారు. సోమవారం మధ్యాహ్నం 3గంటలలోపు సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. ఆయన ఇచ్చే వివరణ ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనుంది.

News September 19, 2025

మైథాలజీ క్విజ్ – 10

image

1. శ్రీరాముడి పాదధూళితో శాపవిముక్తురాలైంది ఎవరు?
2. కురుక్షేత్ర యుద్ధంలో శకునిని ఎవరు చంపారు?
3. కృష్ణద్వైపాయనుడు అంటే ఎవరు?
4. మధుర మీనాక్షి దేవాలయం ఏ నది ఒడ్డున ఉంది?
5. చిరంజీవులు ఎంత మంది?
– సమాధానాలు సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం. <<-se>>#mythologyquiz<<>>

News September 19, 2025

అన్నమయ్య: టాప్ గ్రేడ్ బొప్పాయి ధర@ రూ.8

image

అన్నమయ్య జిల్లాలో బొప్పాయి ఎగుమతికి ధరలను నిర్ణయించినట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ గురువారం తెలిపారు. టాప్ గ్రేడ్ బొప్పాయి ధర కిలో రూ.8గా, సెకండ్ గ్రేడ్ ధర కిలో రూ.7గా నిర్ణయించామన్నారు. తక్కువ ధరకు బొప్పాయిని కొనుగోలు చేసే ట్రేడర్లపై రైతులు ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ సూచించారు. ఇందుకోసం కంట్రోల్ రూమ్ నంబర్లు 9573990331, 9030315951ను అందుబాటులో ఉంచారు.