News February 10, 2025
కేజ్రీలో భయం: పంజాబ్ CM, MLAలతో భేటీ?

పంజాబ్ CM భగవంత్ మాన్, ఎమ్మెల్యేలతో AAP అధినేత అరవింద్ కేజ్రీవాల్ రేపు ఢిల్లీలో సమావేశం అవుతారని తెలిసింది. ఢిల్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత అక్కడ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. 30కి పైగా MLAలు తమతో టచ్లో ఉన్నారని కాంగ్రెస్, BJP నేతలు బాహాటంగానే చెప్తున్నారు. పైగా శాంతిభద్రతలు, టెర్రరిజం, డ్రగ్ మాఫియా అంతంపై అమిత్ షా డైరెక్షన్లో మాన్ పనిచేస్తున్నారు. దీంతో కేజ్రీకి చీలిక భయం పట్టుకుంది.
Similar News
News November 9, 2025
‘హౌ టు కిల్ ఓల్డ్ లేడి?’ అని యూట్యూబ్లో చూసి..

AP: దొంగా-పోలీస్ ఆడదామంటూ విశాఖలో అత్త కనకమహాలక్ష్మి(66)ని కోడలు లలిత చంపిన ఘటనలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. అత్తను చంపే ముందు లలిత యూట్యూబ్లో ‘హౌ టు కిల్ ఓల్డ్ లేడి?’ అనే వీడియోలు చూసింది. తన తల్లి స్నానానికి వెళ్లగా, దాగుడు మూతల పేరిట పిల్లల్ని గదిలోకి పంపింది. అత్తను కట్టేసి పెట్రోల్ పోసి తగులబెట్టింది. ఎదురింట్లో AC బిగిస్తున్న వ్యక్తి కనకమహాలక్ష్మిని కాపాడేందుకు రాగా లలిత అడ్డుకుంది.
News November 9, 2025
కేజీ చికెన్ ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో చికెన్, మటన్ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. కార్తీక మాసంలోనూ మాంసం అమ్మకాలు జోరుగా సాగుతుండటంతో రేట్లు తగ్గలేదు. ఇవాళ హైదరాబాద్లో స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.220-260, సూర్యాపేటలో రూ.230, కామారెడ్డిలో రూ.250, నిజామాబాద్లో రూ.200-220, విజయవాడలో రూ.260, గుంటూరులో రూ.220, మచిలీపట్నంలో రూ.220గా ఉన్నాయి. ఇక మటన్ ధరలు రూ.750-రూ.1,100 మధ్య ఉన్నాయి. మీ ఏరియాలో రేటు ఎంతో కామెంట్ చేయండి.
News November 9, 2025
HCLలో 64 జూనియర్ మేనేజర్ పోస్టులు

హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్(<


