News February 10, 2025
సిద్దిపేట: జిల్లాలో పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు

సిద్దిపేట జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. వచ్చే రెండు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 2-5 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నిన్న గరిష్ఠంగా తొగుట 35.5, బెజ్జంకి 35.1, కోహెడ 35 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతుడటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
Similar News
News March 25, 2026
మెంటాడ మళ్లీ గజపతినగరంలో కలిసేనా?

నియోజకవర్గాల పునర్విభజనకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో మెంటాడ ప్రజలు తమ మండలాన్ని సాలూరు నుంచి వేరు చేయాలని కోరుతున్నారు. సాలూరు మన్యం జిల్లాలో ఉండగా.. మెంటాడ విజయనగరంలో కొనసాగుతుండడంతో పరిపాలన, అభివృద్ధి పరంగా వెనుక పడుతున్నామని స్థానికుల అభిప్రాయం. ఈ సమస్యను పలుమార్లు అధికారులు, రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం తాజా నిర్ణయంతో మెంటాడను మళ్లీ గజపతినగరంలో కలపాలని వారు కోరుతున్నారు.
News March 25, 2026
రాహుల్ పర్యటన రద్దు.. కేరళంకు రేవంత్

కడుపు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాహుల్ గాంధీ అక్కడే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన కేరళం టూర్ రద్దయింది. రాహుల్కు బదులుగా కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసేందుకు TG CM రేవంత్ కేరళంకు బయల్దేరారు.
News March 25, 2026
తిరుపతి జిల్లాలో 246 మంది డుమ్మా

రాష్ట్రవ్యాప్తంగా బుధవారం 10వ తరగతి భౌతిక శాస్త్రం పరీక్ష జరిగింది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 27,068 మంది విద్యార్థులకు గాను 26,822 మంది హాజరుకాగా 246 మంది గైర్హాజరైనట్లు DEO KVN కుమార్ తెలిపారు. ఓపెన్ స్కూల్ సొసైటీ పదో తరగతి పరీక్షలకు సంబంధించి 839 మందికి గాను 732 మంది హాజరై 107 మంది గైర్హాజరు అయినట్లు పేర్కొన్నారు. ప్రశాంతంగా పరీక్షలు జరిగినట్లు ఆయన అన్నారు.


