News February 10, 2025
SRD: జిల్లాలో పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు

సంగారెడ్డి జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. వచ్చే రెండు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 2-5 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నిన్న గరిష్ఠంగా అందోల్ 35.1, వట్ పల్లి 35, నిజాంపేట 34.4, జిన్నారం 34 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
Similar News
News March 9, 2026
మిడిల్ ఈస్ట్ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాం: జైశంకర్

మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై MEA జైశంకర్ పార్లమెంట్లో ప్రకటన చేశారు. అక్కడి పరిణామాలు తీవ్ర ఆందోళనలు కలిగిస్తున్నా నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. మన ఇంధన అవసరాల విషయంలో మిడిల్ ఈస్ట్ కీలకమన్నారు. క్రూడాయిల్ ధర పెరుగుదలపై అప్రమత్తంగా ఉన్నట్లు చెప్పారు. భారతీయుల భద్రతకు కేంద్రం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. టెహ్రాన్లోని భారతీయ ఎంబసీ కార్యకలాపాలు నిర్వహిస్తోందన్నారు.
News March 9, 2026
HYD: చెత్త కనిపిస్తే వాట్సాప్ చేయండి

పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో ప్రజలు కార్యాలయాల దాకా రాకుండానే పారిశుద్ధ్య సమస్యలు తెలియజేసేందుకు వాట్సాప్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. రోడ్లపై చెత్త పేరుకుపోయినా, చెత్త బిన్లు నిండిపోయినా, నాలాల్లో వ్యర్థాలు ఉన్నా ఫొటో తీసి, లొకేషన్తో వాట్సాప్ నంబర్కు పంపాలన్నారు. ఈ నంబర్లు సేవ్ చేసుకోండి
GHMC: 8125966586
మల్కాజిగిరి: 9063421300
సైబరాబాద్: 9063421347
News March 9, 2026
HYD: చెత్త కనిపిస్తే వాట్సాప్ చేయండి

పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో ప్రజలు కార్యాలయాల దాకా రాకుండానే పారిశుద్ధ్య సమస్యలు తెలియజేసేందుకు వాట్సాప్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. రోడ్లపై చెత్త పేరుకుపోయినా, చెత్త బిన్లు నిండిపోయినా, నాలాల్లో వ్యర్థాలు ఉన్నా ఫొటో తీసి, లొకేషన్తో వాట్సాప్ నంబర్కు పంపాలన్నారు. ఈ నంబర్లు సేవ్ చేసుకోండి
GHMC: 8125966586
మల్కాజిగిరి: 9063421300
సైబరాబాద్: 9063421347


