News February 10, 2025

మండపేట: సెంట్రింగ్ కర్ర తగిలి వ్యక్తి మృతి

image

మండపేటకు చెందిన కొమ్మిశెట్టి సత్తిబాబు సోమవారం అనపర్తికి తన ఆటోలో సెంట్రింగ్ కర్రలు పట్టుకుని పనికి వెళ్లాడు. ఆటో టైర్ సెంట్రింగ్ కర్రపైకి ఎక్కింది. అదే వేగంతో కర్ర ఒక పక్క లేచి సత్తిబాబు ముఖానికి గట్టిగా తగిలింది. దీంతో ఒక్కసారిగా అతను వెనక్కి పడిపోయాడు. స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు తెలిపారు.

Similar News

News April 18, 2026

గ్యాస్ బుకింగ్స్ తగ్గాయి: కేంద్రం

image

దేశవ్యాప్తంగా LPG గ్యాస్ సిలిండర్లకు డిమాండ్ తగ్గిందని కేంద్రం తెలిపింది. రోజువారీ బుకింగ్స్ 46-50 లక్షల మధ్య ఉన్నాయని చెప్పింది. సిలిండర్ల సరఫరా కూడా స్థిరంగా కొనసాగుతోందని, ఎక్కడా కొరత లేదని పేర్కొంది. పెట్రోల్, డీజిల్ సప్లై సాధారణంగానే జరుగుతున్నట్లు వెల్లడించింది. కాగా ఇరాన్, US శాంతి ఒప్పందానికి దగ్గరవడం, హార్ముజ్ జలసంధిని తెరవడంతో దేశంలో LPG కష్టాలు తప్పనున్నాయి.

News April 18, 2026

TCS ఘటన ‘కార్పొరేట్ జిహాద్’: మహారాష్ట్ర సీఎం

image

TCS నాసిక్‌ క్యాంపస్‌‌లో <<19663286>>మత మార్పిడి<<>> వ్యవహారం జిహాద్‌ లాంటిదని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ అన్నారు. ఇది ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. ‘ఈ జిహాద్‌ను మేం వివిధ రూపాల్లో చూశాం. లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ వచ్చాయి. వాటి కంటే ఈ కార్పొరేట్ జిహాద్ ఇంకా తీవ్రమైనది. ఇది ఓ కంపెనీ ఆఫీసులోనే జరిగిందా? లేక ఏదైనా పెద్ద కుట్ర ఉందా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నాం’ అని తెలిపారు.

News April 18, 2026

సత్యసాయి: కార్లు అద్దెకు తీసుకుని మోసం.. నిందితుడి అరెస్ట్

image

కార్లను బాడుగకు తీసుకుని, యజమానులకు తెలియకుండా కుదువ పెట్టి మోసం చేసిన అన్నవరం గౌతం రాజును సత్యసాయి జిల్లా నల్లమాడ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు యజమానులను నమ్మించి మూడు కార్లు తీసుకుని, వాటిని ఇతరుల వద్ద కుదువ పెట్టి లక్షలాది రూపాయలు వసూలు చేశాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడి నుంచి మూడు కార్లను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.