News February 10, 2025

భద్రాచలం: తల్లితో గొడవపడి బాలిక ఆత్మహత్య

image

తల్లితో గొడవపడి ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భద్రాచలం పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. పట్టణంలోని ఎంపీ కాలనీకి చెందిన 9వ తరగతి బాలిక(14) తన తల్లి విజయలక్ష్మితో కొన్ని రోజులుగా గొడవ పడుతోంది. తల్లితో గొడవను తట్టుకోలేక మనస్తాపం చెందిన ఆ బాలిక క్షణికావేశంలో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆదివారం తల్లి ఫిర్యాదుతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. 

Similar News

News March 14, 2026

పదో తరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

image

పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. శనివారం జనగామలోని సెయింట్ మేరీస్ స్కూల్, ధర్మకంచ జెడ్పీహెచ్‌ఎస్‌ పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించారు. పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించిన ఆయన, అధికారులకు పలు సూచనలు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, బయటి వ్యక్తుల ప్రవేశం నిషిద్ధమని స్పష్టం చేశారు.

News March 14, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారు వెండి ధరలు ఇలా.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి.
*24 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.15,700
*22 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.14,444
*వెండి 10 గ్రాముల ధర రూ.2,620.

News March 14, 2026

OTD: క్రికెట్ చరిత్రలో మర్చిపోలేని రోజు

image

ఇండియన్ క్రికెట్ చరిత్రలో అద్భుతం జరిగి నేటికి సరిగ్గా 25 ఏళ్లు. 2001 కోల్‌కతా టెస్టులో టీమ్ ఇండియా ఫాలో-ఆన్ ఆడుతూనే ఆస్ట్రేలియాను ఓడించి రికార్డు సృష్టించింది. VVS లక్ష్మణ్ (281), రాహుల్ ద్రవిడ్ (180) నాలుగో రోజంతా వికెట్ పడకుండా పోరాడి భారత్‌కు 171 పరుగుల చరిత్రాత్మక విజయాన్ని అందించారు. దీంతో టెస్టుల్లో వరుసగా 16 విజయాలతో దూకుడు మీదున్న ఆసీస్‌కు బ్రేక్ వేశారు.