News March 20, 2024
నేటి నుంచి భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్ర

AP: నేటి నుంచి చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్ర చేపట్టనున్నారు. 20, 21, 22 తేదీల్లో కడప, అన్నమయ్య జిల్లాలో ఆమె పర్యటించనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్తో మనోవేదనకు గురై చనిపోయిన వారి కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. వారికి రూ.3 లక్షల పరిహారం కూడా చెల్లించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ సిద్ధం చేస్తోంది.
Similar News
News April 18, 2025
జేఈఈ మెయిన్ ‘కీ’ విడుదల

జేఈఈ మెయిన్-2025 సెషన్-2 ఫైనల్ ‘కీ’ని ఎట్టకేలకు NTA విడుదల చేసింది. <
News April 18, 2025
MMTSలో అత్యాచారయత్నం కేసు.. బిగ్ ట్విస్ట్

కొద్దిరోజుల క్రితం HYD MMTSలో అత్యాచారయత్నం సందర్భంగా యువతి రైలు నుంచి కిందకి <<15866506>>దూకేసిన<<>> ఘటనలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. అసలు యువతిపై అత్యాచార యత్నమే జరగలేదని విచారణలో తేలింది. రైలులో వెళ్తూ ఇన్స్టా రీల్స్ చేసిన ఆమె ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. ఈ విషయం చెబితే అంతా తిడతారని భయపడి ఓ యువకుడు అత్యాచారం చేయబోగా కిందకి దూకేసినట్లు చెప్పింది. తాజాగా ఆమె నిజం ఒప్పుకోవడంతో పోలీసులు షాక్ అయ్యారు.
News April 18, 2025
ఢిల్లీ నుంచి ఏ శక్తీ తమిళనాడును పాలించలేదు: స్టాలిన్

కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు, పార్టీలను విచ్ఛిన్నం చేసే BJP వ్యూహాలు తమిళనాడులో పనిచేయవని CM స్టాలిన్ స్పష్టం చేశారు. ఆ పార్టీ కలిగించే అడ్డంకులను చట్టప్రకారం ఎదుర్కొంటామని చెప్పారు. ‘2026లోనూ తమిళనాడులో ద్రవిడ ప్రభుత్వమే వస్తుంది. ఢిల్లీ నుంచి ఏ శక్తీ మా రాష్ట్రాన్ని పాలించలేదు. వారికి తలవంచడానికి మేం బానిసలం కాదు. నేను బతికున్నంత వరకు ఇక్కడ ఢిల్లీ ప్రణాళికలు పనిచేయవు’ అని తేల్చిచెప్పారు.