News March 20, 2024

సముద్ర దొంగల ఆట కట్టించేందుకు వ్యూహాత్మక అడుగులు: యూఎస్ రాయబారి

image

సాగర జలాల సరిహద్దుల్లో చొరబాట్లు, సముద్రపు దొంగల ఆట కట్టించేందుకు భారత్‌తో కలిసి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నామని భారత్‌–యూఎస్‌ రాయబారి ఎరిక్‌ గార్సెట్టి వెల్లడించారు. ట్రయంఫ్‌ యుద్ధ విన్యాసాల కోసం విశాఖ తూర్పు నావికాదళ ప్రధాన కార్యలయానికి వచ్చిన ఆయన ఐఎన్‌ఎస్‌ జలశ్వ యుద్ధ నౌకలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. భారత్, అమెరికా మధ్య రక్షణ విభాగ బంధం మరింత బలోపేతం అవుతుందన్నారు.

Similar News

News September 5, 2025

గాజువాకలో యాక్సిడెంట్.. ఒకరు మృతి

image

గాజువాక ఆటోనగర్‌లో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళుతున్న వ్యక్తిని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కాపు తుంగ్లంకు చెందిన కోన అప్పారావు(70)గా గుర్తించారు. బైక్‌పై ఇంటికి వెళుతుండగా ఆటోనగర్ అన్న క్యాంటీన్ వద్ద ఈ ఘటన జరిగింది. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News September 5, 2025

కబడ్డీకి విశాఖలో ఆదరణ అద్భుతం: ఎంపీ

image

విశాఖ వేదికగా జరుగుతున్న ప్రో కబడ్డీ లీగ్‌‌‌కు ఆదరణ అద్భుతంగా ఉందని విశాఖ ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్ అన్నారు. గురువారం జరిగిన తెలుగు టైటాన్స్-జైపూర్ పింక్ పాంథర్స్ మ్యాచ్‌ను ఆయన వీక్షించారు. విశాఖ ప్రజలు కబడ్డీని అద్భుతంగా ఆదరిస్తున్నారని, ఈ ప్రో లీగ్ ద్వారా మరోసారి నిరూపితమైందని పేర్కొన్నారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి ఉన్నారు.

News September 5, 2025

నేడు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన

image

విశాఖలో శుక్రవారం జరగనున్న ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్‌కు సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. ఈరోజు ఉదయం 7.30గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి హెలికాప్టర్‌లో బయలదేరనున్నారు. అనంతరం రాడిసన్ బ్లూ హోటల్‌లో ఉదయం 10 గంటలకు జరిగే ACIAM ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్‌కు హాజరవుతారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ జస్టిస్‌లో భాగంగా ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ (ADR)పై సీఎం ప్రసంగించనున్నారు.