News February 10, 2025

NZB: BRS దుకాణం క్లోజ్: PCC అధ్యక్షుడు

image

తెలంగాణలో BRS దుకాణం క్లోజ్ ఆయిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు చేశారు. BRSలో KTR- కవిత-హరీశ్ రావు మధ్య మూడు ముక్కలాట నడుస్తోందని వ్యాఖ్యానించారు. సోమవారం PCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకని పశ్నించారు. కులగణన సర్వేలో పాల్గొనని KTR ఆయన కుటుంబ సభ్యులకు రీ సర్వే జరపమని అడిగే అర్హత లేదన్నారు.

Similar News

News February 11, 2025

జక్రాన్‌పల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

నిజామాబాద్ జిల్లా 44 నంబర్ జాతీయ రహదారిపై సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. జక్రాన్‌పల్లి మండలం పడకల్ వద్ద ట్రాక్టర్‌ను కంటైనర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో రాజేశ్వర్, ఓడ్డేన్న మృతి చెందగా.. విజయ్ గౌడ్, మహేశ్ తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు. వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News February 11, 2025

నవీపేట్: చదువు అర్థం కావడం లేదని విద్యార్థి ఆత్మహత్య

image

నవీపేట్ మండలం అబ్బాపూర్ గ్రామానికి చెందిన అభిషేక్ ఇంటర్ మొదటి సంవత్సరం ఫెయిల్ అవ్వడంతో తల్లదండ్రులు మళ్లీ ఒప్పించి కాలేజీలో జాయిన్ చేశారు. తన తోటి ఫ్రెండ్స్‌తో చదువు అర్థం కావడం లేదని మనస్థాపం చెంది గత నెల 27వ తేదీన పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చికిత్స నిమిత్తం నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలిచగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 11 గంటలకు మృతి చెందినట్లు పోలీసులు వివరించారు.

News February 11, 2025

NZB: జిల్లా ఓటర్ల వివరాలు

image

నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్‌, కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లా ఓటర్ల వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని మొత్తం 33 మండలాల్లో 48 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 31,574 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో భాగంగా నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో 19,993 మంది పురుషులు, 11,581 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు వివరించారు.

error: Content is protected !!