News February 10, 2025

లోకసభ స్పీకర్‌ను అయ్యన్న ఆహ్వానం

image

రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణంరాజు సోమవారం ఢిల్లీలో లోకసభ స్పీకర్ ఓంబిర్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 22వ తేదీన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ హాల్లో రెండు రోజులపాటు ఎమ్మెల్యేలకు ఓరియంటేషన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని లోకసభ స్పీకర్‌ను కోరారు. ఈ మేరకు ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.

Similar News

News February 11, 2025

DANGER: ఈ ఫుడ్ కలర్ వాడితే క్యాన్సర్ రావొచ్చు!

image

అమెరికాలో బ్యాన్ చేసిన ‘RED DYE #3’ ఫుడ్ కలర్‌ను చీప్‌గా వస్తోందని ఇండియాలోని చాలా కంపెనీలు వాడుతున్నాయి. ఈ రంగును చాక్లెట్స్, డ్రింక్స్, కేకుల్లో వాడుతుంటారు. ఇది హానికరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘RED DYE #3’ ఎలుకపై టెస్ట్ చేయగా అది క్యాన్సర్‌కు దారితీసింది. పిల్లల్లో హైపర్ యాక్టివిటీ, ఎలర్జీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రొడక్ట్ లేబుల్ చెక్ చేసి దానిలో ‘RED3’ అని ఉంటే వాటిని కొనకండి.

News February 11, 2025

ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం: MHBD ఎస్పీ

image

మహబూబాబాద్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సుదీర్ రామ్నాథ్ కేకన్ హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణాపై పోలీస్ శాఖ దాడులు నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఎవరైనా ఇసుక రవాణా చేస్తే కఠినమైన సెక్షన్స్ కింద(PDPP ACT, MINES ACT) కేసులు పెట్టడం జరుగుతుందని తెలిపారు. ఇసుక అక్రమ రవాణా నిరోధించేందుకు 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.

News February 11, 2025

సంగారెడ్డి: డంప్ యార్డ్‌కు వ్యతిరేకంగా రైతుల వినూత్న నిరసన

image

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారా నగర్‌లో డంప్ యార్డుకి వ్యతిరేకంగా నేటికి ఏడవ రోజు నిరసనలు వెల్లివెత్తుతున్నాయి. నిరసనల్లో భాగంగా రైతులు పాడి పశువులతో డంపు యార్డుకి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తున్నారు. పచ్చని పంట పొలాలు డంప్ యార్డు వలన బీడు భూములుగా మారే పరిస్థితి ఏర్పడిందని, పశువులకు మేత కూడా దొరకని పరిస్థితి నెలకొందని వాపోయారు. ఇప్పటికైనా ఏర్పాటు చేయకుండా విరమించుకోవాలన్నారు.

error: Content is protected !!