News February 10, 2025

దొంగతనాలకు పాల్పడిన 5గురు అరెస్ట్ 

image

ఏలూరు, పరిసర ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడిన 5గురిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. ఏలూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ 13 కేజీల వెండి,186 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్, 3 టౌన్ సీఐ కోటేశ్వరరావు, కైకలూరు సీఐ కృష్ణ 3 టౌన్ ఎస్ఐ ప్రసాద్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.

Similar News

News July 6, 2025

రేపటి నుంచి 8 గంటల ముందే..

image

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రిజర్వేషన్ ఛార్టుల ప్రిపరేషన్‌లో కొత్త విధానం జులై 7 నుంచి అమలు కానుంది. ఇప్పటివరకు రైలు బయల్దేరడానికి 4 గంటల ముందే ఛార్జ్ ప్రిపేర్ అవుతుండగా, రేపటి నుంచి 8 గంటల ముందే ఛార్ట్ ప్రిపేర్ కానుంది. మధ్యాహ్నం 2 గంటల్లోపు బయల్దేరే రైళ్ల ఛార్టులను ముందురోజు రాత్రి 9 గంటలకల్లా వెల్లడిస్తారు. దీనివల్ల బెర్త్ దొరకనివారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవచ్చు.

News July 6, 2025

31 మంది మందుబాబులకు జైలు శిక్ష: వరంగల్‌ CP

image

మద్యం తాగి వాహనం నడపిన 31 మందికి జైలు శిక్ష విధించినట్లు వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. మద్యం తాగి వాహనం నడపడం ద్వారా పత్యక్షంగా, పరోక్షంగా రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతోందన్నారు. అలాంటి ప్రమాదాల్లో పలువురు మృత్యువాత పడ్డ సందర్భాలూ ఉన్నాయన్నారు. మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News July 6, 2025

నిరాశ పరిచిన జూన్.. రైతన్నను వెంటాడుతున్న కష్టాలు

image

నల్గొండ జిల్లాలో రైతుల పరిస్థితి దైన్యంగా మారింది. ఈసారి నైరుతి రుతుపవనాలు ముందస్తుగా ప్రవేశించాయని.. మంచి వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలపడంతో రైతులు సంతోషించారు. జిల్లాలో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో వ్యవసాయం మందగించిపోతుంది. వానాకాలం సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా మోస్తరు వర్షాలే తప్ప.. భారీ వర్షం జాడ కానరావడం లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.