News February 10, 2025
KMR: ‘క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి’

ప్రతి పోలీసు విధి నిర్వహణలో క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని పోలీసు సీనియర్ అధికారులు సూచించారు. KMR జిల్లా ఎస్పీ సింధుశర్మ ఆదేశాల మేరకు ఇటీవల నూతనంగా నియామకమైన కానిస్టేబుల్లకు జిల్లా పోలీసు కార్యాలయంలో రెండు రోజుల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్లో విధులు ఎలా నిర్వర్తించాలి, ప్రజలతో ఎలా మెలగాలి తదితర విషయాలను కామారెడ్డి సీఐ చంద్రశేఖర్ వివరించారు.
Similar News
News March 26, 2026
HYD: సూసైడ్ నోట్ రాసి యువతి ఆత్మహత్య

కుత్బుల్లాపూర్లోని పేట్ బషీరాబాద్ PS పరిధిలో పల్లవి లహరి(19) అనే యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సందీప్తో ప్రేమలో ఉన్న ఆమె, మార్చి 24 జరిగిన గొడవ తర్వాత ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకుంది. సందీప్ తిరిగి వచ్చి చూడగా, అప్పటికే ఆమె మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో సందీప్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 26, 2026
HYD: సూసైడ్ నోట్ రాసి యువతి ఆత్మహత్య

కుత్బుల్లాపూర్లోని పేట్ బషీరాబాద్ PS పరిధిలో పల్లవి లహరి(19) అనే యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సందీప్తో ప్రేమలో ఉన్న ఆమె, మార్చి 24 జరిగిన గొడవ తర్వాత ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకుంది. సందీప్ తిరిగి వచ్చి చూడగా, అప్పటికే ఆమె మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో సందీప్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 26, 2026
HNK: మత్తు పౌడర్ కేసులో ముగ్గురికి 10 ఏళ్ల జైలు శిక్ష

హనుమకొండ జిల్లా కోర్టు మత్తు పదార్థాల కేసులో ముగ్గురు నిందితులకు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. గుంటూరు జిల్లాకు చెందిన ఆర్.లక్ష్మణరావు, పూసల చైతన్యకుమార్, లింగాల సైదులకు తలా రూ.2 లక్షల జరిమానా విధిస్తూ జడ్జి అపర్ణాదేవి తీర్పు చెప్పారు. 2023లో గుంటూరు నుంచి హైదరాబాద్కు మత్తు పౌడర్ తరలిస్తుండగా అలంకార్ జంక్షన్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. విచారణలో నేరం రుజువైంది.


