News February 10, 2025
ADB: పత్తి కొనుగోళ్లు తాత్కాలికంగా బంద్

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు తాత్కాలికంగా నిలిపి వేసినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు సోమవారం తెలిపారు. రైతుల ఆధార్ వెరిఫికేషన్లో పలు సాంకేతిక సమస్యల రీత్యా కొనుగోళ్లు నిలిపివేసినట్లు వెల్లడించారు. తర్వాత కొనుగోళ్లు తేదీని వెంటనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ విషయమై రైతులు సహకరించాలని కోరారు.
Similar News
News January 5, 2026
ఆదిలాబాద్: డీసీసీబీని సందర్శించిన కలెక్టర్

ఆదిలాబాద్లోని డీసీసీబీని కలెక్టర్, డీసీసీబీ ప్రత్యేక అధికారి రాజర్షిషా సోమవారం సందర్శించారు. బ్యాంకులో అందిస్తున్న సేవలు, సిబ్బంది పనితీరు, ఖాతాదారులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఇతర పరిపాలన సంబంధిత అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. బ్యాంకు సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచనలు చేశారు. జిల్లా సహకార శాఖ అధికారి మోహన్, సీఈఓ సూర్యప్రకాష్ పాల్గొన్నారు.
News January 5, 2026
ఆదిలాబాద్: ఉపాధ్యాయులందరికీ ఓడీ సౌకర్యం కల్పించాలి: తపస్

జిల్లాలో టెట్ పరీక్షల నేపథ్యంలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులందరికీ ఓడీ సౌకర్యం కల్పించాలని తపస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సునీల్ చౌహాన్, వలబోజు గోపికృష్ణ కోరారు. సోమవారం అదనపు కలెక్టర్, ఇన్ఛార్జి DEO రాజేశ్వర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. నూతన తపస్ కమిటీని పరిచయం చేశారు. వేసవికాలంలో వృత్యంతర శిక్షణకు హాజరైన ఉపాధ్యాయులందరికీ ఐదు రోజులు సంపాదిత సెలవులు మంజూరు చేయాలన్నారు.
News January 5, 2026
ఆదిలాబాద్: బాధితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: ఎస్పీ

ఆదిలాబాద్ పోలీసు ముఖ్య కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి 29 మంది ఫిర్యాదుదారులు ఎస్పీకి నేరుగా సమస్యలు తెలియజేశారు. ఎస్పీ అఖిల్ మహాజన్ స్పందించి సంబంధిత పోలీసు అధికారులకు సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాల సమాచారం ఉన్న 8712659973 నంబర్కు వాట్సాప్ ద్వారా చెప్పాలన్నారు. సీసీ రాజు, సిబ్బంది కవిత, వామన్ పాల్గొన్నారు.


