News February 10, 2025
20 లక్షల ఇళ్లకు సౌర విద్యుత్: చంద్రబాబు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739196034426_81-normal-WIFI.webp)
AP: PM సూర్యఘర్ పథకం కింద ఈ ఏడాది 20 లక్షల కుటుంబాలకు సోలార్ విద్యుత్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు CM చంద్రబాబు వెల్లడించారు. 2కిలోవాట్ల వరకు SC, STలకు ఉచితంగా సోలార్ పరికరాలు అందిస్తామని చెప్పారు. ఈ పథకం అమల్లో బ్యాంకులూ భాగస్వామ్యం కావాలని బ్యాంకర్లతో భేటీలో CM కోరారు. ఈ పథకంతో అవసరాలకు ఉచితంగా విద్యుత్ పొందడమే కాకుండా, ఉత్పత్తి అయ్యే విద్యుత్తో ప్రజలు ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు.
Similar News
News February 11, 2025
1/70 చట్టాన్ని తొలగించే ప్రసక్తే లేదు: చంద్రబాబు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738676071103_782-normal-WIFI.webp)
AP: గిరిజనుల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. <<15423800>>1/70 చట్టాన్ని<<>> తొలగించే ప్రసక్తే లేదని ఆయన ట్వీట్ చేశారు. ‘గిరిజన జాతుల అస్థిత్వాన్ని కాపాడుతాం. వారి విద్య, వైద్యం, జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాం. గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తాం. 1/70 చట్టంపై దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు. ఆందోళన, అపోహలతో గిరిజనులు ఆందోళన చెందొద్దు’ అని సీఎం పేర్కొన్నారు.
News February 11, 2025
సభలో మాట్లాడటానికే కదా గెలిపించింది: జీవీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739258345350_782-normal-WIFI.webp)
AP: అసెంబ్లీ అంటే భయంతోనే మాజీ CM జగన్ రావట్లేదని ప్రభుత్వ చీఫ్ విప్ GV ఆంజనేయులు ఆరోపించారు. ‘జగన్ అసెంబ్లీకి రాననడం సమంజసమేనా? ఆయనకు కనీసం ఇంగితజ్ఞానం లేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది సభ కాదు.. ప్రజలు. అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు చర్చిస్తే సమాధానమిస్తాం. ప్రజా సమస్యలపై ఆసక్తి లేదు కాబట్టే రావట్లేదు. గతంలో ఏ నాయకుడూ ఇలా చేయలేదు. సభలో మాట్లాడటానికే కదా ప్రజలు గెలిపించింది’ అని నిలదీశారు.
News February 11, 2025
రేపే ‘VD12’ టీజర్.. భారీగా అంచనాలు!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739257786147_746-normal-WIFI.webp)
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న ‘VD12’ సినిమా నుంచి రేపు రిలీజయ్యే టీజర్పై భారీ అంచనాలు పెరిగిపోయాయి. దీనికి స్టార్ హీరోలు వాయిస్ ఓవర్ ఇస్తుండటం విశేషం. తమిళ టీజర్కు సూర్య, హిందీకి రణ్బీర్ కపూర్ వాయిస్ అందించినట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే, తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ అందిస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న నిర్మాత నాగవంశీ కూడా ‘టైగర్’ ఎమోజీని ట్వీట్ చేశారు.