News February 10, 2025
హరీశ్ రావు లేఖకు కేంద్ర మంత్రి స్పందన

సిద్దిపేట-ఎల్కతుర్తి జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా నంగునూరు మండలం రాజగోపాల్ పేట గ్రామంలో సెంట్రల్ లైటింగ్, ఫుట్ పాత్, డ్రైనేజీ ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కారికి మాజీ మంత్రి, MLA హరీశ్ రావు ఇటీవల లేఖ రాశారు. దీనిపై స్పందించిన గడ్కారీ తిరిగి లేఖ రాస్తూ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా మీరు కోరిన పనుల ఏర్పాటుకు అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చామన్నారు. దీంతో హరీశ్ రావు ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News January 11, 2026
హన్మకొండ: యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సూసైడ్

హసన్పర్తి మండలం చింతగట్టు రైల్వే గేట్ వద్ద <<18830665>>మృతి చెందిన<<>> వ్యక్తిని అతని స్నేహితులు గుర్తించారు. మృతుడు నడికుడ మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన దూడే రాజుగా తెలిపారు. మృతుడు యూత్ కాంగ్రెస్ పరకాల ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. పల్సర్ బైకును పక్కన పెట్టి రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News January 11, 2026
చైనా, అమెరికాకు సాధ్యం కానిది ఇండియా సాధించింది: చంద్రబాబు

AP: బెంగళూరు-కడప-విజయవాడ కొత్త నేషనల్ హైవే వారం రోజుల వ్యవధిలోనే 4 గిన్నిస్ రికార్డులను సాధించిందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. 57,500 టన్నుల బిటుమినస్ కాంక్రీటుతో 156 లేన్ కి.మీ రహదారి నిర్మించారని కాంట్రాక్ట్ కంపెనీ రాజ్పథ్ ఇన్ఫ్రాకన్ లిమిటెడ్, NHAIను అభినందించారు. కొత్త రోడ్ల నిర్మాణంలో అమెరికా, చైనా, జర్మనీకి సాధ్యం కానిది.. భారత్ సుసాధ్యం చేసిందని ట్వీట్ చేశారు.
News January 11, 2026
ఆది దంపతులకు పల్లకి ఉత్సవం

శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ఆదివారం రాత్రి పల్లకి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. లోక కళ్యాణం కోసం శ్రీ స్వామి అమ్మవార్లకు పల్లకీ ఉత్సవాన్ని చేపట్టారు. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని పఠించారు. మహాగణపతి పూజ అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పల్లకీలో ఉంచి, శాస్త్రోక్తంగా పల్లకి ఉత్సవాన్ని నిర్వహించారు.


