News February 11, 2025

నిర్మల్‌: పన్నుల వసూలు త్వరగా పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్

image

మున్సిపాలిటీల్లో పన్ను వసూలును త్వరితగతిన పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. నిర్మల్, ఖానాపూర్, భైంసా మున్సిపాలిటీల్లో ఆస్తి, వాణిజ్య, నీటి, వ్యాపార ప్రకటనల పన్నుల వసూలును 100శాతం పూర్తి చేయాలన్నారు. పన్ను వసూలు లక్ష్యం, ఇప్పటి వరకు పూర్తి చేసిన వివరాలపై ఆరా తీశారు.

Similar News

News March 7, 2026

‘పుష్పక్’ వచ్చేస్తోంది.. హార్ముజ్ దాటిన భారత నౌక

image

యుద్ధం నేపథ్యంలో హార్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆంక్షలు విధించడంతో ప్రపంచం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రధానంగా క్రూడ్ ఆయిల్ రవాణా చేసే వందలాది నౌకలు అక్కడే నిలిచిపోయాయి. సోమవారం నుంచి కేవలం 9 ఓడలు మాత్రమే జలసంధిని దాటాయి. ఇందులో భారత్‌కు చెందిన ‘పుష్పక్’ కూడా ఉంది. ఇది పెట్రోలియం ఉత్పత్తులను ఇండియాకు తీసుకొస్తోంది. దీంతో దేశంలో ఇంధన నిల్వలకు మరింత బూస్ట్ రానుంది.

News March 7, 2026

నల్గొండ: తల్లి చనిపోయిన దుఃఖంలోనూ ఎగ్జామ్ రాశాడు

image

కన్నతల్లి మరణించినా, తన భవిష్యత్తు కోసం కన్నీటిని దిగమింగి పరీక్షా హాల్‌కు వెళ్లాడో విద్యార్థి. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లికి చెందిన శివచరణ్ ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న అతని తల్లి హేమలత శనివారం మృతి చెందారు. తల్లి మరణంతో శివచరణ్ పుట్టెడు దుఃఖంలోనూ మనోధైర్యం కోల్పోకుండా పరీక్షకు హాజరయ్యాడు. శివచరణ్ పట్టుదలను చూసి స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు.

News March 7, 2026

విజయవాడలో అర్ధరాత్రి డ్రగ్స్ పట్టివేత

image

విజయవాడలో శుక్రవారం రాత్రి డ్రగ్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన నలుగురు వ్యక్తులు బెంగళూరు నుంచి డ్రగ్స్ తక్కువ ధరకు కొనుక్కొని వచ్చి విజయవాడలో విక్రయించే ప్రయత్నం చేస్తుండగా టాస్క్ ఫోర్స్-మాచవరం పోలీసులు సంయుక్తంగా కలిసి అమ్మ కళ్యాణ మండపం సమీపంలో దాడి చేసి పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 16 గ్రాములు ఎండిఎంఏ డ్రగ్, 4 సెల్ ఫోన్లు, ఓ కాట మెషీన్ స్వాధీనం చేసుకున్నారు.