News February 11, 2025
మహాశివరాత్రి ఏర్పాట్ల సమీక్ష లో పాల్గొన్న మంత్రి అనగాని

శ్రీశైలంలో మహాశివరాత్రి ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. సోమవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన సహచర మంత్రులతో కలిసి ఏర్పాట్లలో చేపట్టవలసిన చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణ, వంగలపూడి అనిత తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 8, 2025
శ్రీవారి సుప్రభాత సేవ ఎలా జరుగుతుందంటే..?

తిరుమల శ్రీవారి ఆలయంలో తొలి సేవ ‘సుప్రభాతం’. ఇది ఉ.3 గంటలకు జరుగుతుంది. స్వామివారిని మేల్కొలిపే దివ్య ఘట్టమిది. పవిత్ర మంత్రాలు, శ్లోకాలు, మధుర నాదాలతో అర్చకులు స్వామివారిని నిదురలేపి, నిత్య కైంకర్యాలకు ఆహ్వానిస్తారు. ఈ సేవతోనే రోజు ప్రారంభమవుతుంది. ఈ సేవకు ఎంపికైన భక్తులకు స్వామివారిని <<17956589>>అతి దగ్గరి నుంచి<<>>(10Ft) దర్శించుకునే మహాభాగ్యం లభిస్తుంది. ☞ మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.
News November 8, 2025
M.T.U 1121.. పచ్చి బియ్యానికి అనుకూలం

ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బాగా ప్రాముఖ్యత కలిగి రైతులచే ఎక్కువగా సాగు చేయబడుతున్న రకం M.T.U 1121( శ్రీ ధృతి). దీని పంట కాలం 120-125 రోజులు. గింజ మధ్యస్త సన్నంగా ఉంటుంది. ఇది చేనుపై పడిపోకుండా అగ్గి తెగులును, దోమ పోటును తట్టుకుంటుంది. మిషన్ కోతకు కూడా అనుకూలమైన రకం. గింజ రాలిక తక్కువగా ఉంటుంది. పచ్చి బియ్యానికి ఈ రకం అనుకూలం. దిగుబడి ఎకరాకు సుమారు 3.5 టన్నులుగా ఉంటుంది.
News November 8, 2025
కరీంనగర్: రైతుల చూపులు.. ఆకాశం వైపు..!

ఉమ్మడి KNR జిల్లాలో వర్షాల మధ్య రైతుల ఆశలు తడిసి ముద్దవుతున్నాయి. చెమటోడ్చి పండించిన బంగారు ధాన్యం ఇప్పుడు ఆకాశం దయ మీద ఆధారపడి ఉంది. ఎండబెట్టిన క్రమంలో కురిసిన చినుకులు రైతు హృదయాన్ని తడుపుతున్నాయి. వడ్ల కొనుగోలు కేంద్రాలు ఆలస్యమవడంతో, పొలాల పక్కన పంటను ఎండబెట్టిన ప్రయత్నంలో రైతులు నిస్సహాయంగా మారారు. కష్టానికి కడుపు నిండే ఫలితం దక్కుతుందా లేదా అనే ఆందోళనలో రైతుల చూపులు ఆకాశం వైపు చూస్తున్నాయి.


