News February 11, 2025
ధాన్యం కొనుగోలు పారదర్శకంగా ఉండాలి: కలెక్టర్

రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోలు పారదర్శకంగా ఉండాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. జగిత్యాల కలెక్టరేట్లో సోమవారం యాసంగి 2024-25 వరిధాన్యం కొనుగోలు సంబంధించిన సన్నద్ధతపై ఆయన సమీక్షా నిర్వహించారు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకునే విధంగా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ బిఎస్ లతా తదితర అధికారులున్నారు.
Similar News
News March 23, 2026
ప్రతి పంచాయతీ అంకాపూర్లాగా అభివృద్ధి చెందాలి: సీఎం

రైతులు లాభసాటి వ్యవసాయంపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ సూచించారు. ఆదివారం సిద్దిపేట(D) నర్మెట సభలో మాట్లాడారు. రైతులు మిల్లెట్స్ ఆర్గానిక్, కాయగూరలు, ఆకుకూరలు, ఆయిల్ పామ్ సాగుపై దృష్టి పెట్టాలన్నారు. పామాయిల్ సాగు లాభదాయకని, ఆదాయం పెరుగుతుందన్నారు. రాష్ట్రంలోని ప్రతి పంచాయతీ అంకాపూర్లాగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రతి రైతు కారు కొనుక్కునేలా లాభసాటి వ్యవసాయం చేస్తూ ఆదాయం పెంచుకోవాలన్నారు.
News March 23, 2026
మూలపేట పోర్టుపై రాజకీయ వేడి

శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో కీలకమైన మూలపేట పోర్టు పనుల్లో డొల్లతనం కనిపిస్తోందని కూటమిపై వైసీపీ విమర్శలు చేస్తోంది. అయితే ఇటీవల పోర్టుకు రోడ్డు, రైలు అనుసంధానానికి కేంద్రం 358 ఎకరాల భూమిని కేటాయించింది. ఇది అభివృద్ధికి పెద్ద పీఠం ఇవ్వనుందని కూటమి పేర్కొనగా..YCP నిర్మాణాలు చకచక జరగడం లేదని MAR30న పోర్టు సందర్శన కార్యక్రమం నిర్వహించనుంది. దీంతో జిల్లాలో అభివృద్ధి పేరుతో రాజకీయ వేడి రాజుకుంటోంది.
News March 23, 2026
HYD: ముంచుకొస్తోంది.. జర జాగ్రత్త!

వేసవి దృష్ట్యా HYDలో ఒక్కపూట బడులు సాగుతున్నాయి. ఈ గ్యాప్లో పిల్లలు సరదాగా ఈతకు వెళ్తుంటారు. ఒక్కోసారి ఈసరదా వెంటే విషాదం పొంచి ఉండే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. హైదరాబాదీలు గతేడాది 8 మంది లోతు తెలియక, ప్రవాహ తాకిడికి మునిగిపోయారు. వేసవిలో రోజుకు నలుగురి చొప్పున ఈత సరదాకు బలయ్యారని గణాంకాలు చెబుతున్నాయి. పెద్దలు, నిపుణుల సమక్షంలో పిల్లలకు ఈత నేర్పండి.


