News February 11, 2025

వెల్దండ మండలంలో 12న మంత్రి సీతక్క పర్యటన

image

వెల్దండ మండలంలో ఈ నెల 12న పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పర్యటించనున్నారు. వెల్దండ నుంచి రాయచూర్ వరకు చేపట్టబోయే బీటీ రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తో కలిసి ఆమె భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేస్తారు. అనంతరం నియోజకవర్గంలో జరిగే వివిధ కార్యక్రమాలలో మంత్రి పాల్గొంటారు. సీతక్క పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చేశారు.

Similar News

News March 22, 2026

సౌదీ అరేబియాలో నెల్లికుదురు వాసి మృతి

image

సౌదీ అరేబియా-ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు ఓ పేద కుటుంబంలో తీరని శోకాన్ని నింపాయి. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్తపల్లికి చెందిన రవిగోపాల్ ఉపాధి నిమిత్తం కొంతకాలంగా సౌదీ అరేబియాలో పని చేస్తున్నారు. ఇటీవల ఇరాన్ జరిపిన డ్రోన్, క్షిపణి దాడిలో ఆయన తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు సమాచారం.

News March 22, 2026

త్వరలో యాదాద్రికి MMTS

image

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి భక్తులకు త్వరలో రైల్వే శాఖ తీపి కబురు అందించనుంది. వచ్చే నెలలో ప్రధాని మోదీ చేతుల మీదుగా MMTS రెండో దశ పనులకు అంకురార్పణ జరగనుంది. సుమారు రూ.430 కోట్ల వ్యయంతో ఘట్‌కేసర్ నుంచి రాయగిరి వరకు 33KM మేర కొత్త లైన్ నిర్మించి, రెండున్నరేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని దక్షిణ మధ్య రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. ఇక భక్తులు అతి తక్కువ ఖర్చుతో నేరుగా క్షేత్రానికి చేరుకోవచ్చు.

News March 22, 2026

HYD: ముంచుకొస్తోంది.. జర జాగ్రత్త!

image

వేసవి దృష్ట్యా HYDలో ఒక్కపూట బడులు సాగుతున్నాయి. ఈ గ్యాప్‌లో పిల్లలు సరదాగా ఈతకు వెళ్తుంటారు. ఒక్కోసారి ఈసరదా వెంటే విషాదం పొంచి ఉండే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. హైదరాబాదీలు గతేడాది 8 మంది లోతు తెలియక, ప్రవాహ తాకిడికి మునిగిపోయారు. వేసవిలో రోజుకు నలుగురి చొప్పున ఈత సరదాకు బలయ్యారని గణాంకాలు చెబుతున్నాయి. పెద్దలు, నిపుణుల సమక్షంలో పిల్లలకు ఈత నేర్పండి.