News February 11, 2025
సంగారెడ్డి: ప్రతిభ పోటీలను సద్వినియోగం చేసుకోవాలి: DEO

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సైన్స్ మ్యూజియంలో నిర్వహించిన జిల్లా స్థాయిలో నిర్వహించిన భౌతిక రసాయన శాస్త్రం ప్రతిభ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. అనంతరం డిఈవో మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రతిభ పోటీలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Similar News
News March 19, 2026
మధ్యాహ్నం నుంచి భారీ వర్షాలు

AP: రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ మధ్యాహ్నం నుంచి భారీ వడగళ్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు వెల్లడించారు. ఉ.గోదావరి, గుంటూరు, పల్నాడు, అనకాపల్లి, విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం, మన్యం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని తెలిపారు. రాత్రి నుంచి తిరుపతి, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు.
News March 19, 2026
KNR: నాయబ్ తహశీల్దార్లకు పదోన్నతులు.. బదిలీలు

KNR ఉమ్మడి జిల్లాలో 14 మంది నాయబ్ తహశీల్దార్లు పదోన్నతితో బదిలీ అయ్యారు. JGTL నుంచి ఖాదీర్ (నిర్మల్), వరప్రసాద్ (ఆదిలాబాద్), కిరణ్, విష్ణు (NZB), ముక్తార్ పాషా (JGTL), శ్రీనివాస్ (ఆదిలాబాద్), KNR నుంచి నిజాముద్దీన్ (ఆసిఫాబాద్), వసంతరావు, స్వరూపరాణి (BPLPY), అజ్రత్ (NZB), వైశాలి (సిరిసిల్ల), రాజన్న సిరిసిల్ల నుంచి మారుతిరెడ్డి (సిరిసిల్ల), దివ్యజ్యోతి (NZB)కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
News March 19, 2026
ఆర్టీసీ అధికారులకు కలెక్టర్ సూచన

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దివ్యాంగ శక్తి ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆర్టీసీ అధికారులకు సూచించారు. బస్టాండ్లలో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ర్యాంపులు, బస్సు పాస్ కౌంటర్లు, బస్సు సీట్లు కేటాయించాలని ఆదేశించారు. దివ్యాంగులతో వ్యవహరించే తీరుపై కూడా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు తగు శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ సూచించారు.


